రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి చూసుకుందాం – రేవంత్ వార్నింగ్

ప్రపంచంతో భారత్ పోటీ పడుతుందంటే కారణం మజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసింది ఆయనేనని చెప్పుకొచ్చారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఆవిష్కరించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీపై మరోసారి ఫైర్ అయ్యారు.

సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాం ఎలా పెడుతారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించిన రేవంత్…ఆయన వల్లే కేటీఆర్ ఐటీ చదివి అమెరికా వెళ్లారన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ పరిచయం చేయకపోతే కేటీఆర్ ఎక్కడ ఉండేవాడు అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం గురించి కేసీఆర్ ఫ్యామిలీకి ఏం తెలుసు..? అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని అనుకున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ అధికారంలో ఉనప్పుడు ఇందిరా గాంధీ ఏ బాధ్యత తీసుకోలేదు. కొందరు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని మంత్రి పదవులు పొందారని.. కేటీఆర్ కు చురకలు అంటించారు.

అధికారం పోయినా కేటీఆర్ కు మదం దిగలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో పెడితే ఎందుకు పెడుతారని ప్రశ్నిస్తారా? అని కేటీఆర్ పై మండిపడ్డారు. త్యాగం అంటే ఏమిటో గాంధీ ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని అనుకున్నారట..10ఏళ్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని కేటీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. ఫామ్ హౌజ్ లు కట్టుకున్నావు.. లక్ష కోట్లు దింగమింగి కాళేశ్వరం కట్టుకున్నావు..తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని కేసీఆర్ ను నిలదీశారు. సచివాలయంలో కేసీఆర్ విగ్రహం పెట్టుకోడానికి స్థలం ఉంచుకున్నారని ఆరోపించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి.. చూసుకుందామని రేవంత్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close