తిరుమ‌ల ల‌డ్డూ వివాదం… తీవ్రంగా స్పందించిన కేంద్ర‌మంత్రులు

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ల‌డ్డూ త‌యారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్న‌ట్లు తేల‌టంపై దేశ‌వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే హిందూ ధార్మిక సంస్థ‌లు తీవ్రంగా స్పందించ‌గా, తాజాగా కేంద్ర‌మంత్రులు ఘ‌ట‌న‌పై విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని కేంద్ర హోంశాఖ స‌హ‌య మంత్రి బండి సంజ‌య్ సీఎం చంద్ర‌బాబుకు లేఖ రాశారు. శ్రీ‌వారి ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీశార‌ని, అన్య‌మ‌త ప్ర‌చారం కొండ‌పై జ‌రుగుతుంద‌ని ఫిర్యాదులు వ‌చ్చినా గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌న్నారు. క్షమించ‌రాని నేరం చేసిన వారిని విడిచిపెట్ట‌వ‌ద్ద‌ని, అన్య‌మ‌తస్తుల‌ను చైర్మ‌న్లుగా చేశార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల అనుమానాల‌ను నివృతి చేయాల‌ని బండి సంజ‌య్ కోరారు.

మీ చుట్టూ జ‌రుగుతున్న హిందూ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌ను క్ష‌మించు స్వామి… తిరుమ‌ల‌కు చెందిన కాలేజీల్లో శ్రీ‌నివాసుడి ఫోటోలు తొల‌గించార‌ని, హిందూయేత‌ర గుర్తుల‌ను స‌ప్త‌గిరుల‌పై ఏర్పాటు చేయాల‌ని ఆనాటి జ‌గ‌న్ స‌ర్కార్ చూసింద‌ని మ‌రో కేంద్ర‌మంత్రి శోభాక‌రంద్లాజే వ్యాఖ్యానించారు.

చంద్ర‌బాబు చెప్పిన అంశం చాలా తీవ్ర‌మైన‌ది, దీనిపై వెంట‌నే స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌గాలి… దోషుల‌ను శిక్షించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషీ అన్నారు.

దేశ‌వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతున్న ఈ మొత్తం ఎపిసోడ్ పై ఏపీ సీఎం చంద్ర‌బాబు అందుబాటులో ఉన్న మంత్రుల‌తో చ‌ర్చించారు. త‌దుప‌రి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించి, సాయంత్రం లోపు పూర్తిస్థాయి నివేదిక‌ను పంపాల‌ని టీటీడీ ఈవోను ఆదేశించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

జగన్ రెడ్డి లాజిక్ : తప్పు బయటపెట్టడం తప్పుు !

తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ చేయడం తప్పు కాదు కానీ అలా బయట పెట్టడం మాత్రం.. హిందూ ధర్మానికి తూట్లు పొడవడమే.. భక్తుల సెంటిమెంట్ ను దెబ్బతీయమేనట. జగన్ రెడ్డి ఎంతో కష్టపడి...

చిరంజీవికి అక్కినేని అవార్డ్‌!

ఏఎన్నార్ జాతీయ అవార్డు ఈ యేడాది మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్న‌ట్టు నాగార్జున ప్ర‌క‌టించారు. ఈనెల 28న హైద‌రాబాద్ లో అవార్డు ప్ర‌దానోత్స‌వం జ‌ర‌గ‌బోతోంది. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close