జానీ మాస్ట‌ర్ కేస్‌: సి.క‌ల్యాణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ల్యాణ్ స్పందించారు. కొన్ని సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు. ఈ కేసు వెనుక కొంత‌మంది కుట్ర ఉంద‌ని, ఆ విష‌యాల్ని త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. ప‌ద‌హారేళ్లుగా ఆ అమ్మాయిపై అత్యాచారం జ‌రుగుతుంటే, ఇంత‌కాలం ఎందుకు నోరు మెద‌ప‌లేద‌ని ప్ర‌శ్నించారు. జానీమాస్ట‌ర్ ఆ అమ్మాయికి కొరియోగ్రాఫ‌ర్‌ కార్డు రాకుండా అడ్డుకొన్నార‌న్న‌ది పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని, కొంత‌మంది ఆ అమ్మాయికి కార్డు రాకుండా చేస్తే, జానీ మాస్ట‌ర్ పోరాడి, కార్డు వ‌చ్చేలా క‌ష్ట‌ప‌డ్డార‌ని గుర్తు చేశారు. ఆ అమ్మాయి ఎదుగుద‌ల‌కు జానీ మాస్ట‌ర్ కార‌ణ‌మ‌ని, అలాంటి వ్య‌క్తికి ఇప్పుడు కెరీర్ లేకుండా చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జానీ మాస్ట‌ర్ ఆ అమ్మాయికి అవ‌కాశాలు రాకుండా చేశారన్న విష‌యంపైనా క‌ల్యాణ్ స్పందించారు. అదే నిజ‌మైతే, జానీ మాస్ట‌ర్‌ హీరోగా చేసే సినిమాలో ఆ అమ్మాయికి కొరియోగ్రాఫ‌ర్ గా ఛాన్స్ ఎందుకు ఇస్తార‌ని ప్ర‌శ్నించారు.

ఇండ‌స్ట్రీ గురించి సంబంధం లేని వ్య‌క్తులు మాట్లాడుతుంటే బాధ‌గా ఉంద‌ని, ఇదే అదునుగా తీసుకొని, కొంత‌మంది త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి, ద‌ర్శ‌క నిర్మాత‌ల ప‌రువుని బ‌జారుకీడ్చే ప్ర‌య‌త్నాలూ చేయొచ్చ‌న్న అనుమానం వ్య‌క్తం చేశారు. చిత్ర‌సీమ‌లో కులం లేద‌ని, అలాంటి చిత్ర‌సీమ‌ని వ్య‌క్తిపై ల‌వ్ జీహాదీ లాంటి ఆరోప‌ణ‌లు చేస్తుంటే బాధ‌గా ఉంద‌న్నారు. దాస‌రి నారాయ‌ణ రావు ఉండి ఉంటే.. ప‌రిస్థితి ఇంత దూరం వ‌చ్చేది కాద‌ని, ఆయ‌న లేని లోటు క‌నిపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. జానీ మాస్ట‌ర్ త‌ప్పు చేసి ఉండి ఉంటే.. త‌ప్ప‌కుండా కోర్టు శిక్షిస్తుంద‌ని, అప్పుడు ప‌రిశ్ర‌మ కూడా జానీని స‌పోర్ట్ చేయ‌ద‌ని, న్యాయాన్యాయాలు కోర్టులోనే తేలుతాయ‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు క‌ల్యాణ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close