బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు కానీ..ఇప్పుడు ఎవరూ నోరు మెదపలేకపోతున్నారు. అందుకే ఆయనకు మనసంతా గందరగోళంగా ఉన్నట్లుగా ఉంది.. బీజేపీ నేతలకు టెస్టు పెట్టేశారు. తిట్టాలని .. లేకపోతే మనుషులు కాదని అనేశారు.

ఎందుకంటే.. చంద్రబాబు తిరుపతి లడ్డూలపై నిజాన్ని బయట పెట్టారట. తాను సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ ముఖ్య నేతలు చెప్పిన వారికి టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇచ్చానని వారికి నెయ్యి టెండర్ల గురించి తెలియదా.. తెలియకపోతే తెలుసుకుని చంద్రబాబును తిట్టాలన్నారు. తాను చెప్పినవన్నీ నిజాలని.. ఈ విషయం తెలుసుకుని.. బీజేపీ నేతలు నిజంగా హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబుపై అక్షింతలు చల్లాలని టెస్టు పెట్టారు.

నిజంగానే సిన్సియర్ గా మనుషులు అయితే ఇలా చేయడం ధర్మమేనా చంద్రబాబు అని గట్టిగా కడిగేయాలన్నారు. నిజంగా వాళ్లలో సిన్సియారిటీీ ఉన్న మనుషులయితే ఇలా చేస్తారని కూడా చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి చెప్పేది ఏలా ఉందంటే.. తాను వారికి టీటీడీ బోర్డు మెంబర్ షిప్ ఇచ్చాను కాబట్టి లడ్డూ పాపంలో భాగం తీసుకుని దాన్ని బయట పెట్టిన చంద్రబాబును తిట్టాలని అంటున్నారు. జగన్ రెడ్డి కి ఉన్న తెలివి తేటలు.. ఇంకెవరికి ఉండవని ఎందుకు అనుకుంటున్నారో మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close