అమరావతిలో భవనాలకు జపాన్ సంస్థ డిజైన్స్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించబోయే భవనాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, అత్యంత సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా, పర్యావరణానుకూలంగా, రాష్ట్ర సంస్క్రతిని ప్రతిభింభించేవిగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుకొంటున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలువగా భారత్ కి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ డీవీ జోషి, బ్రిటన్ కి చెందిన రిచర్డ్ రోజస్, జపాన్ కి చెందిన మాకి అండ్ అసోసియేట్స్ డిజైన్లు సమర్పించాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత అనుకూలంగా ఉన్న డిజైన్ న్ని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వారిలో ముగ్గురు విదేశీయులు ముగ్గురు భారతీయులు సభ్యులుగా ఉన్నారు. వారిలో సుహాజ్‌ ఓల్టా, ఇర్విన్‌, క్రిస్టోఫర్‌ విదేశీ నిపుణులు కాగా రవీంద్ర నాథ్, కేశవా వర్మ, రాజీవ్ సేథిలు భారత్ కి చెందినవారు. వారు జపాన్ సంస్థ రూపొందించిన డిజైన్లను ఖరారు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, సి.ఆర్.డి.ఏ. అధికారులకి కూడా అదే నచ్చడంతో దానినే ఖరారు చేసారు. విజయవాడ గేట్ వే హోటల్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసారు.
Amaravati1

Amaravati2

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రికి సీఎం సూచనలివ్వడం కూడా తప్పేనా ?

వైసీపీ మీడియా, సోషల్ మీడియా ఎంత భావదారిద్ర్యంలో ఉందో ... నాదెండ్ల మనోహర్ కు చంద్రబాబు క్లాస్ అంటూ చేస్తున్న ప్రచారంతోనే తేలిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరద సహాయ చర్యలు జోరుగా...

“ఫ్యాన్స్”కు బ్రహ్మాజీ కితకితలు

వైసీపీ ఫ్యాన్స్ అంటే అందరికీ అలుసైపోతున్నారు. ప్రతి ఒక్కరూ టీజ్ చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా బ్రహ్మాజీ కూడా చేరారు. జగన్ రెడ్డి .. వరదల సహాయ చర్యలపై సుదీర్ఘమైన...

రంగంలోకి భార‌త మాస్ట‌ర్ మైండ్… ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెర‌?

దేశంలోని అంత‌ర్గ‌త భ‌ద్ర‌త మాత్ర‌మే విదేశాల‌తో సంబంధాల విష‌యంలో భార‌త మాస్ట‌ర్ మైండ్ అజిత్ దోవ‌ల్. రిటైర్డ్ అధికారి అయినా, భార‌త ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం అత‌న్ని ఇంకా కొన‌సాగిస్తుంది అంటే త‌న...

రవిచంద్రారెడ్డిని గెంటేసిన సాక్షి , వైసీపీ !

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీవీ చానళ్లలో ఆపార్టీ తరపున బూతుల సంప్రదాయాన్ని కొనసాగించిన వ్యక్తి రవిచంద్రారెడ్డి. సాక్షిలో రోజూ ఆయన విపక్షాలపై.. విపక్ష నేతలపై ఆయన వ్యాఖ్యలు అసహ్యం పుట్టించేలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close