యాకూబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌పై రేపు ‘సుప్రీం’ తీర్పు

హైదరాబాద్: ముంబాయి పేలుళ్ళ కేసులో ఉరి శిక్ష విధించబడిన దోషి యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈనెల 30న అతనికి ఉరిశిక్ష అమలు జరగనున్న సంగతి తెలిసిందే. 250మందికి పైగా ప్రాణాలను బలి తీసుకున్న 1993నాటి ముంబాయి పేలుళ్ళ కేసులో పట్టుబడిన యాకూబ్ నేరం రుజువు కావటంతో అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. యాకూబ్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈ నెల 21న కొట్టిపారేసింది. అయితే అతనికి క్షమాభిక్ష పెట్టాలని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. వీరిలో బీజేపీ ఎంపీ శతృఘ్నుసిన్హా, కాంగ్రెస్ నాయుకుడు మణిశంకర్ అయ్యర్, సీపీఎం నాయకుడు సీతారామ్ ఏచూరి, సుప్రీమ్ కోర్టు న్యాయవాది రాంజెఠ్మలాని, నటుడు నజీరుద్దీన్ షా, దర్శకుడు మహేష్ భట్ ఉన్నారు. మరోవైపు నటుడు సల్మాన్ ఖాన్ యాకూబ్ ఉరిని వ్యతిరేకిస్తున్నట్లు ట్వీట్ చేయటంతో పెద్ద వివాదం చెలరేగటం, ఆ వ్యాఖ్యలను అతను ఉపసంహరించుకోవటం తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close