శ్రీ సిటిలో ఇసుజు వాహనాల ఉత్పత్తి మొదలు

చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వ్యాపించి ఉన్న శ్రీ సిటీ పారిశ్రామిక పట్టణంలో రూ. 3000 కోట్లు పెట్టుబడితో జపాన్ కి చెందిన ఇసుజు మోటార్స్ భారత్ విభాగం డి-మాక్స్ పికప్ వాహనాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దాని మొదటి దశ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇవ్వాళ్ళ నుంచి ఉత్పత్తి కూడా మొదలుపెట్టింది దానిలో తయారయిన మొట్టమొదటి వాహనం ఇవ్వాళ్ళ బయటకి వచ్చింది. మొదటి దశలో ఏడాదికి 50,000 పికప్ వాహనాలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు ఇసుజు మోటార్స్ సంస్థ ప్రెసిడెంట్ మసనోరి కటయామ తెలిపారు. రెండవ దశ నిర్మాణం పూర్తయితే ఏడాదికి 1,20,000 వాహనాలను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. భారత్ మార్కెట్ పై సుమారు నాలుగేళ్లపాటు సర్వే చేసిన తరువాతఇక్కడ మంచి వ్యాపారావకాశాలున్నట్లు గుర్తించి ఈ ప్లాంట్ నెలకొల్పామని అయన చెప్పారు. ఈ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన వాహనాలను కేవలం భారత్ లోనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ లో 70శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని చెప్పారు. ఈ వాహనాల తయారీ కోసం అవసరమయిన కొన్ని విడిభాగాలను తయారు చేసేందుకు 120 సంస్థలతో ఒప్పందాలు చేసుకొన్నామని, వాటిలో చాలా సంస్థలు ఈ ప్రాంతంలోనే తమ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పబోతున్నాయని, వాటి ద్వారా కూడా వందలాది మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు.

శ్రీ సిటీలోనే సుమారు రూ. 1500 కోట్లు పెట్టుబడితో నెలకొల్పబడుతున్న మొండలీజ్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా రెండు రోజుల క్రితమే తన మొదటి దశ ఉత్పత్తి కార్యక్రమాలను ప్రారంభించింది. దానిలో ఏడాదికి 60,000 టన్నుల క్యాడ్ బరీస్ చాక్లెట్లు ఉత్పత్తి అవుతాయి. మొత్తం మూడు దశలలో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెడితే ఏడాదికి 2.5 లక్షల టన్నుల మిల్క్ చాక్లెట్స్, బిస్కట్లు తయారవుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close