ఏ-2 విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి విరమించుకుని పొలం పనులు చేసుకుంటానని చెప్పారు కానీ అదంతా అబద్దమేనని ఢిల్లీ రాజకీయవర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆయన బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వెంటనే చేరితే మరో రకమైన ప్రచారం జరుగుతుందని తన రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక జరిగిన తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నారు.
జూన్ లేదా జూలై నెలలో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని చెబుతున్నారు. ఇటీవల ఉపరాష్ట్రపతి ధన్ బడ్ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ విజయసాయిరెడ్డి ప్రత్యక్షమయ్యారు. వంగి వంగి దండాలు పెడుతూ ఫోటోలు దిగారు. రాజకీయాల నుంచి విరమించుకుంటే బీజేపీకి చెందిన ముఖ్య నేతలు ఎప్పుడు.. ఎవరు వచ్చినా ఎందుకు హాజరు వేయించుకుని దండాలు పెడుతున్నారన్నది చాలా మందికి అర్థం కాలేదు. కానీ విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లానేంటో తెలిసిన తర్వాత అందరూ ముక్కుల వేలేసుకుంటున్నారు.
విజయసాయిరెడ్డిపై లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మాఫియాలా మారి ఆస్తులు కాజేశారు. ఆ కేసులు ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో ఆయన నెంబర్ 2. ఆ కేసులు ఇంకా ట్రయల్ కే రావడంలేదు. ఇప్పుడు అవి విచారణకు వస్తే ఆయనతో పాటు జగన్ కూడా జైలుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే.. బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు కూటమి పార్టీలు అంగీకరిస్తారా లేదా అన్నది సస్పెన్స్. రాజీనామా చేసినప్పుడు చంద్రబాబుతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి… పవన్ మిత్రుడు అంటూ చెప్పుకున్న వైనాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.