కల్కి దర్సకుడు, అశ్వనీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ ఇటీవల ఇన్ స్టాలో మన ఖర్మ అని ఓ పోస్టు పెట్టారు. అదేమిటో చాలా మందికి అర్థం కాలేదు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చి పదేళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్టు దీనిపై ప్రశ్నించారు. మన ఖర్మ అని పోస్టు పెట్టి ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. దానికి నాగ్ అశ్విన్ తాను పోస్టు తీసేయాలని చెప్పారు. అయితే ఎందు కోసం పెట్టారో కూడా చెప్పారు. నాలుగు వందల ఎకరాలల్లో చెట్లు కొట్టేస్తారన్న ఉద్దేశంతో తాను అలా పెట్టానని చెప్పారు.
గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం అమ్మకానికి పెట్టి కొన్ని వేల కోట్ల ఆదాయం సంపాదించుకోవాలని అనుకుంటోంది. ఈ క్రమంలో కన్సల్టెంట్లను కూడా నియమించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ల్యాండ్ విషయంలోనే నాగ్ అశ్విన్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ స్థలంలో పెద్ద ఎత్తున చెట్లు ఉన్నాయని గచ్చిబౌలికి లంగ్ స్పేస్ గా ఉందని దాన్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చవద్దని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఈ క్రమంలో వారి వాయిస్ కు నాగ్ అశ్విన్ కూడా జత అయినట్లుగా తెలుస్తోంది.
ఇలా ప్రభుత్వం, రాజకీయ పరమైన అంశాల్లో ఇలాంటి పోస్టులు పెడితే ఇబ్బందులు ఎదురవుతాయి కదా సందేహాలను కూడా నాగ్ అశ్విన్ పట్టించుకోలేదు. అక్కడ ఉన్న చెట్లు కొట్టేయకపోతే మంచిదని చెప్పారు. నాగ్ అశ్విన్ ఎప్పుడూ రాజకీయాల జోలికి రాలేదు. అలాగని ఆయన భయపడిన సందర్భం కూడా లేదు. గతంలో కల్కి సినిమా టిక్కెట్ల విషయంలోనూ రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పుడూ అలాగే స్పందించారు.