ఖూనీ కేసు డైవర్షన్ – అచ్చెన్నాయుడు కుటుంబంలో అరెస్టులు!

ఏపీలో రాజ్యాంగం ఉందో లేదో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓ వైపు వైసీపీ నేతల అరాచకాలు కళ్ల ముందు కనిపిస్తూంటే చర్యలు తీసుకోరు కానీ.. అసలు ఫిర్యాదులే లేని కేసుల్లో టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు. సొంత బాబాయ్ వివేకాను ఖూనీ చేసిన కేసులో సీబీఐ ప్రధాన నిందితుడని ఆరోపిస్తున్న అవినాష్ ను కాపాడటానికి కిందా మీదా పడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ నేతలపై మాత్రం అసలు ఫిర్యాదుల లేకుండానే సీఐడీని ఉసిగొల్పి అరెస్టులు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడేమో అని భయంభయంగా ఉంటూ… అచ్చెన్నాయుడు ఫ్యామిలీలోని కీలక వ్యక్తుల్ని సీఐడీతో అరెస్ట్ చేయించారు.

ఎర్రన్నాయుడు కుమార్తె అదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి వాసుతో పాటు మామ ఆదిరెడ్డి అప్పారావును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి చిట్ ఫండ్ వ్యాపారం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వారిని సీఐడీ తీవ్రంగా వేధించడంతో ఆదిరెడ్డి భవాని ఓటింగ్ కు రాకుండా వె్ళ్లిపోయారు. అయితే అచ్చెన్నాయుడు వెళ్లి నచ్చ చెప్పి తీసుకు వచ్చారు. ఆ చిట్ ఫండ్ కంపెనీపై ఎలాంటి ఫిర్యాదులు ఖతాదారులు చేయకపోయినా వారే సోదాలు చేసి అక్రమాలు ఉన్నాయని కేసులు పెట్టేసి అరెస్ట్ చేసేశారు.

సీఐడీ పోలీసులు ఇప్పటికే మార్గదర్శి విషయంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. అన్నిచట్టాల్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో కక్ష సాధింపు అరెస్టులో భాగమయ్యారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీలో చేరలేదనే బీసీ కుటుంబాన్ని వేధిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.ఓ వైపు ముఖ్యమంత్రి కుటుంబమే తీవ్రమైన ఖూనీ కేసుల్లో ఉంటే.. మరో వైపు ప్రతిపక్ష నేతల అరెస్టులు ప్రజాస్వామ్యంపై మరింత ఆందోళన కలిగిస్తున్నాయని టీడీపీ నేతలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close