చంద్రబాబుతో మైక్రోసాఫ్ట్ సి.ఐ.ఓ.సత్య నాదెళ్ళ సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ సి.ఐ.ఓ. సత్య నాదెళ్ళ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ముప్పావు గంట సేపు సాగావలసిన వారి సమావేశం సుమారు గంటన్నరపాటు సాగింది. హైదరాబాద్ వచ్చిన సత్య నాదెళ్ళను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్పాహార సమావేశానికి ఆహ్వానించడంతో ఆయన అందుకు అంగీకరించి ఈ సమావేశానికి హాజరయ్యారు. విద్య, వ్యవసాయం, పౌరసేవలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు సత్య నాదెళ్ళ అంగీకరించారు. ముఖ్యంగా ప్రాధమిక స్థాయి నుండి హైస్కూల్ స్థాయి వరకు వివిధ కారణాలతో, సమస్యలతో మధ్యలో చదువు ఆపేస్తున్న విద్యార్ధుల సంఖ్యను పూర్తిగా తగ్గించదానికి అవసరమయిన సహాయ సహకారాలు అందించేందుకు సత్య నాదెళ్ళ అంగీకరించినట్లు తెలుస్తోంది.

అలాగే రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి భూసార పరీక్షలు, వాతావరణ పరిస్థితులు, సస్య రక్షణలో సరికొత్త విధానాలు తదితర అంశాలలో రైతులకు అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఆయన అంగీకరించారు. మైక్రోసాఫ్ట్ కొత్తగా అభివృద్ధి చేసిన ‘అజూర్’ సాఫ్ట్ వేర్ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు సత్య నాదెళ్ళ అంగీకరించారని తెలుస్తోంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా తమ సంస్థ రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు.

రాష్ట్రంలో ఐటి, సాఫ్ట్ వేర్ రంగం అభివృద్దికి సహకరించాలని అందుకోసం ఆంధ్రాలో పర్యటించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్య నాదెళ్ళను కోరారు. విశాఖపట్నంలో ఇప్పటికే ఐటి, సాఫ్ట్ వేర్ సంస్థలు అనేకం స్థాపించబడి ఉన్నాయి కనుక విశాఖలో మైక్రోసాఫ్ట్ సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సత్య నాదెళ్ళను కోరారు. ఈ సమావేశానికి సత్య నాదెళ్ళ పావుగంట ముందే అంటే ఉదయం 7.45 గంటలకే చేరుకోగా, సంబందిత శాఖల అధికారులు మాత్రం ఆలస్యంగా చేరుకోవడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close