ఏపీ లిక్కర్ స్కాం – ఓ కేస్ స్టడీ !

ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపడిన తర్వాత అక్కడ జరిగిన నేరాల గురించి.. డబ్బుల ట్రాన్సాక్షన్స్ గురించి తెలిసిన తర్వాత ఏపీలో అందరూ అదేమైనా పెద్ద స్కామా అనుకుకున్నారు. ఎందుకంటే ఏపీలో జరిగింది అంద కంటే బహిరంగ దోపిడీ. లక్ష కోట్లు నగదు రూపంలో లావాదేవీలు జరిగాయి. ఈ స్కాంలో ఒకటి నుంచి వంద దాకా మొత్తం ఓ మాఫియాదే రాజ్యం. విచారణ ప్రారంభించగానే పెద్ద తలకాయలు ఈజీగా దొరికిపోతాయి.

మద్యం వ్యాపారం మొత్తం గత ప్రభుత్వ పెద్దల గుప్పిట్లోనే ఉంది. అమ్మేది ప్రభుత్వ దుకాణం పేరు మీద. కానీ అందులో పని చేసే మనుషులు దగ్గర్నుంచి లిక్కర్ తయారీ బ్రాండ్లు, రవాణా సహా మొత్తం అయిన వాళ్ల గుప్పిట్లోనే ఉండేది. పైగా అంతా పూర్తిగా నగదు లావాదేవీలు. ఎన్ని వేల కోట్లు వెనకేశారో చెప్పడం కష్టం. అన్ని విభాగాల్లో వైసీపీ నేతలు దూరిపోయి ప్రైవేటు డిస్టిలరీల్లో మద్యం సేకరణ నుంచి… లైసెన్సులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సీసాల తయారీదారులు, నగదు వసూలు శాఖల వరకు అన్ని చోట్ల కమిషన్లకు తెరతీశారు.

Also Read: కలలోకి వస్తున్న రెడ్ బుక్ !

వైసీపీ నేతల డిస్టిలరీల్లో తయారయ్యే ఊరూపేరూ లేని మద్యాన్ని అమ్మారు. టార్గెట్లు పెట్టి మరీ అమ్మించారు. వాటిలో విష రసాయనాలు ఉన్నాయని నివేదికలు వచ్చినా పట్టించుకోలేదు. నగదు లావాదేవీలు మాత్రమే జరిపారు. మద్యం దుకాణాల్లో వైసీపీ నేతలు మాత్రమే ఉన్నారు. నగదు రూపంలోనే విక్రయాలు జరపడం ద్వారా అవి ప్రభుత్వ రికార్డుల్లోకి వెళ్లకుండా చూసుకున్నారు. రఘురామ స్వయంగా ల్యాబుల్లో మద్యాన్ని టెస్టులు చేయించి రిపోర్టులు కేంద్రానికి సమర్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రముఖ మద్యం కంపెనీలు కూడా .. కేంద్రానికి ఫిర్యాదు చేశాయి.

ఇప్పటికే కావాల్సినంత సమాచారాన్ని సేకరించేశారు. సీఐడీ అడుగు పెట్టి.. చర్యలు తీసుకోవడమే మిగిలింది. అసలేం జరిగిందో ప్రజల ముందు పెడితే.. అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close