ఉద్యోగుల చలో విజయవాడపై ఉక్కుపాదమే !

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేతలు పీఆర్సీ విషయంలో చేస్తున్న ఉద్యమంలో భాగంగా మూడో తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి సత్తా చాటుతామని ప్రకటించారు. అయితే ర్యాలీపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. నైట్ కర్ఫ్యూ నిబంధనలు పొడిగిస్తూ నిన్న మధ్యాహ్నమే ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కూడా అనుమతి లేదని ఉద్యోగులు ఎవరూ విజయవాడ రావొద్దని ప్రకటించారు.

మరో వైపు జిల్లాల్లో కలెక్టర్లు రంగంలోకి దిగారు. ఎవరైనా ఉద్యమానికి వెళ్తే గుర్తు పెట్టుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో వైపు అనూహ్యంగా ఆ ర్యాలీ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు లేవనెత్తేలా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చల వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే ఆ చర్చల్లో ఒక్క డిమాండ్ పై కూడా సానుకూలంగా చెప్పడం లేదు. ఇప్పటికే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నామని ఇప్పుడు పాత జీతాలు ఇవ్వాలంటే సాధ్యం కాదని.. అలాగే జీవోలు కూడా రద్దు చేయడం కుదరదని స్పష్టం చేశారు.

సజ్జల రామకృష్ణారెడ్డి చలో విజయవాడ ఫెయిల్ చేయడానికి అనేక రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో సమ్మె వద్దని హైకోర్టు కూడా సూచించిందని… ఉద్యోగ సంఘాలు హైనకోర్టు సూచనలను అయినా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఉద్యోగులు మాత్రం సజ్జల వ్యూహాలను రాత్రికి ఆలస్యంగా అర్థం చేసుకున్నారేమో కానీ చలో విజయవాడ నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె కూడా ఖాయమని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ వివాదం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close