లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఎక్సైజ్ శాఖ డాక్యుమెంట్లు మాయం చేస్తూ దొరికిపోయిన కేసు, గుడివాడలో మద్యం గోడౌన్ లీజు వ్యవహారంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే తిరస్కరించారు. అయినా సీఐడీ అరెస్టు చేయలేదు. ఆయన కు చెందిన హైదరాబాద్, విజయవాడల్లోని నివాసాల్లో సోదాలు చేశారు.

ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు లిక్కర్ స్కాంపై సీఐడీ విచారణకు ఆదేశించారు. దీంతో ప్రధాన కేసు నమోదు చేసి.. నిందితుల అరెస్టు ప్రారంభిస్తారని తెలియగానే ఆయన కనిపించకుండా పోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది. రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌కు చెందిన ఆయనను రాష్ట్రానికి తీసుకు వచ్చి..మద్యం బిజినెస్ చేతిలో పెట్టారు.అయితే ఆయన ఓ స్టాంప్ మాత్రమే మిగతా అంతా వైసీపీ నేతలే నడిపించారు. కానీ మొత్తం ఆయన పేరు మీద నడిచింది. దీంతో ఆయన అప్రూవర్ గా మారితే దొంగలంతా దొరికిపోతారు.

Also Read : ఏపీ లిక్కర్ స్కాం – ఓ కేస్ స్టడీ !

ఆయన అప్రూవర్ గా మారుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ లోపే ఆయన కనిపించకుండా పోయారు. దీంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు కనీ ఇప్పటికే ఆయన దేశం దాటి వెళ్లిపోయి ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అవకాశం ఉన్నప్పుడు అరెస్టు చేయకుండా ఆయన కనిపించకుండా పోయిన తర్వాత లుకౌట్ నోటీసులు జారీ చేస్తే ప్రయోజనం ఏమిటన్న చర్చ నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close