రాజ్ కోట్ టెస్ట్‌: అశ్విన్ క‌నిపించ‌డం లేదు

రాజ్ కోట్ టెస్టులో భార‌త బౌల‌ర్లు విజృంభించారు. రెండో రోజు వికెట్లు తీయ‌డంలో విఫ‌ల‌మైన బౌలింగ్ ద‌ళం. మూడో రోజు ల‌య‌లోకి వ‌చ్చారు. 207/2 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ చివ‌రికి 319 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. అంటే ఈరోజు భార‌త బౌట‌ర్లు 112 ప‌రుగులు ఇచ్చి 8 వికెట్లు తీసుకొన్నార‌న్న‌మాట‌. భార‌త బౌల‌ర్ల‌లో సిరాజ్‌కు 4 వికెట్లు ద‌క్కాయి. కుల‌దీప్‌, జ‌డేజా చెరో రెండు వికెట్లు పంచుకొన్నారు. మొత్త‌మ్మీద భార‌త్ కు 124 ప‌రుగుల కీల‌క ఆధిక్యం ద‌క్కింది. రెండో ఇన్నింగ్స్‌లో క‌నీసం 250 ప‌రుగులు చేసినా, భార‌త్ ఈ మ్యాచ్‌పై ప‌ట్టు సాధించిన‌ట్టే.

*అశ్విన్ కు ఏమైంది?

మూడో టెస్ట్ మూడో రోజు మైదానంలో అశ్విన్ క‌నిపించ‌లేదు. కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రికి ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డంతో అశ్విన్ హ‌ఠాత్తుగా ఇంటికి ప‌య‌న‌మ‌య్యాడు. దాంతో భార‌త‌జ‌ట్టు 10మంది ఆట‌గాళ్ల‌తోనే ఈ మ్యాచ్ ఆడాల్సివ‌స్తోంది. అశ్విన్ బ‌దులుగా మ‌రో ఆట‌గాడ్ని తీసుకొన్నా కేవ‌లం ఫీల్డింగ్ కి మాత్ర‌మే ప‌రిమితం చేయాలి. అశ్విన్ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మైదానం వీడాల్సివ‌చ్చినందున కంక‌ష‌న్ ప్లేయ‌ర్ ని తీసుకొనే అవ‌కాశం లేకుండా పోయింది. భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో 10మంది బ్యాట‌ర్లే బ్యాటింగ్ చేస్తారు. బౌలింగ్ లో న‌లుగురు స్పెష‌లిస్ట్ బౌల‌ర్లే అందుబాటులో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దళితుల్ని పావుగా వాడేసిన జగన్

జగన్ రెడ్డికి తన రాజకీయమే ముఖ్యం. తన హయాంలో దళిత అధికారుల్ని ముందు పెట్టి చేసిన వ్యవహారాలతో వారంతా ఎన్నోతిప్పలు పడుతున్నారు. ఇప్పుడు తనకు రాజకీయంగా వచ్చిన కష్టానికి కూడా దళితుల్నే...

పొంగులేటి ఇంట్లో కట్టల గుట్టలు ?

పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నోట్ల కట్టలు పెద్ద ఎత్తున బయటపడినట్లుగా తెలుస్తోంది. వాటిని లెక్క పెట్టడానికి రెండు కౌంటింగ్ మెషిన్లను ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. మొదట ఓ మెషిన్ ను తీసుకెళ్లారు..సరిపోవడం...

కార్యకర్తలకు నోటీసులిస్తే జగన్ టూర్ రద్దు చేసుకున్నారట !

తిరుమల టూర్ ను జగన్ ఎందుకు రద్దు చేసుకున్నారు ?. ఆయన కొండపైకి వెళ్లకండా ఎవరైన అడ్డుకుంటే.. అంత కంటే జగన్‌కు కావాల్సిందేమీ ఉండదు. అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ అడ్డుకునేది లేదని తామ...

డిక్లరేషన్ ఇవ్వలేక – తిరుమల జగన్ టూర్ క్యాన్సిల్ !

జగన్ రెడ్డి తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుమలకు వెళ్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తేనే ఆయనను లోపలికి అనుమతిస్తారు. అందుకే డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేని జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు. రద్దు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close