ఎట్టకేలకు డిశ్చార్జ్ అయిన అచ్చెన్నాయుడు..!

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయనకు కరోనా సోకింది. దాంతో కోర్టు ఆదేశాల మేరకు .. మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల కిందట.. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలు లేవని.. హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు బెయిల్ ఇచ్చినా కరోనా కారణంగా ఆయన ఇంటికి వెళ్లలేని పరిస్థితి.

చివరికి ఆయనకు ఈ రోజు చేసిన టెస్టుల్లో కరోనా నెగెటివ్ రావడంతో.. ఇంటికెళ్లేందుకు మార్గం సుగమం అయింది. లాంఛనాలు పూర్తి చేసి..ఆయన ఇంటికెళ్లిపోయారు. రెండున్నర నెలల కిందట అచ్చెన్నాయుడుని ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు బెయిల్ రాకుండా.. ఉండేందుకు మూడో నిందితుడ్ని ఇంత వరకూ అరెస్ట్ చేయలేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఆయనను రాజకీయ కుట్రతోనే అరెస్ట్ చేశారని..టీడీపీ నేతలు కొంత కాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసులో… ఎర్రన్నాయుడు హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యి విచారణకు ఆదేశించడంలో కీలకంగా వ్యవహరించారు. తాను జైలుకు వెళ్లడానికి ఎర్రన్నాయుడు కుటుంబం కూడా ఓ కారణం అనుకుని..జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా.. అచ్చెన్నను కొన్ని రోజులు జైల్లో ఉంచాలన్న లక్ష్యంతోనే ఇలా చేశారని..టీడీపీ నేతలు అంటున్నారు. అచ్చెన్న అవినీతిపై ఏసీబీ అధారాలు చూపించకపోతే.. ఏసీబీ అధికారులు ఇబ్బందులు పడే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close