దేశంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కావాల్సినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికక్కడ ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఆస్పత్రులు డబ్బులు తీసుకుని టీకాలు వేస్తున్నాయి. ఒక్కో టీకా .. సగటున వెయ్యి ఉంటోంది. అదే భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ అయితే.. పదిహేను వందల రూపాయల వరకూ ఉంటోంది. ఒకప్పుడు.. కోవాగ్జిన్ను.. వాటర్ బాటిల్ కంటే తక్కువ రేటుకే ఇస్తామని భారత్ బయోటెక్ ప్రకటించింది. కానీ తీరా ఎందుకు ఎక్కువ రేటు అనే విమర్శలు వస్తున్నాయి. ఇవి తీవ్రం అవుతూండటంతో.. కోవాగ్జిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది.
కోవాగ్జిన్ ఎక్కువ రేటుకు కారణం.. కేంద్రం అని నేరుగా చెప్పేసింది. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం.. తమకు జోస్ రూ. 150 కే ఇవ్వాల్సి వస్తోందని… కేంద్రమే.. ఉత్పత్తిలో 75 శాతం తీసుకుంటోందని.. ఆ మొత్తం ఖర్చును తాము వసూలు చేసుకోవాలంటే.. బహిరంగ మార్కెట్లో డోసు రూ. పదిహేను వందలకు అమ్మాల్సిందేనని స్పష్టం చేసింది. ధర తగ్గించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. అంటే.. కేంద్రానికి ఇస్తున్న డోసుల భారాన్ని కోవాగ్జిన్ నేరుగా ప్రజల నుంచి వసూలు చేస్తోంది.
కేంద్రం .. కంపెనీలను ఆదేశించి తీసుకుంటే.. ఆ కంపెనీలు.. తమ ఉత్పాదక ఖర్చులు.. లాభాలను… మిగిలిన మొత్తం ధరలను పెంచడం ద్వారా వసూలు చేసుకుంటాయి. అంటే కేంద్రం .. సబ్సిడీకి తీసుకుని.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా సరఫరా చేస్తున్న టీకాల ఖర్చులన్నీ.. డబ్బులు పెట్టి.. కొనుక్కుంటున్న ప్రజలు ఇస్తున్నారన్నమాట. ప్రజలు ఈ లాజిక్లను ఎప్పుడు అర్థం చేసుకుంటారో కానీ.. ప్రభుత్వాలు మాత్రం ఈ మాయాజాలాలు కొనసాగిస్తూనే ఉంటాయి.