పెను విషాదం..మట్టి కాదు మరణ శాసనం!

భోలే బాబా పాద ధూళితో జీవితాలు మెరుగుపడుతాయని ఆ భక్తులంతా ఆశపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన వెతలు తీరుతారని బాబా పాదధూళి కోసం ఎగబడ్డారు. కానీ, ఆ మట్టికోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన యూపీలోని హత్రాస్ జిల్లా ఫుల్ రయీలో చోటు చేసుకుంది.

ప్రసిద్ది చెందిన భోలే బాబా దర్శనం కోసం మంగళవారం భక్తులంతా ఒక్కసారిగా ఎగబడటం..బాబా పాదధూళి సేకరించే ప్రయత్నంతో ఊహించని విధంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 116మంది మృతి చెందగా.. వందల మంది గాయపడ్డారు. మృతుల్లో 108మంది మహిళలు, 7చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

భోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. మంగళవారం చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. బాబా పాదధూళి సేకరించేందుకు పెద్దఎత్తున ఒకేసారి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలు ఎక్కడికక్కడ చెల్లాచెదురై పడి ఉండటం, మృతదేహాల పక్కనే స్పృహ కోల్పోయిన వారు ఉండటం.. క్షతగాత్రులు సహాయం కోసం ఎదురు చూస్తుండటం..ఈ హృదయవిదారక దృశ్యాలు అందర్నీ కలిచివేశాయి.

హాహాకారాలతో ఆసుపత్రి ప్రాంగణం పెను విషాదమయంగా మారింది. మృతుల కుటుంబాల ఆర్తనాదాలు స్థానికుల హృదయాలను బరువెక్కించాయి. బాబా మట్టి మిమ్మల్ని అదే మట్టిలో పాతిపెట్టిందంటూ మృతుల బంధువులు రోదించడం తీవ్రంగా కలిచివేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ ను వెక్కిరిస్తోన్న సెంటిమెంట్!

అవును.. కేసీఆర్ నమ్ముకున్న సెంటిమెంటే ఆయనను వెక్కిరిస్తోంది. ప్రత్యర్ధి వ్యూహమో, యాదృచ్చికమో కానీ బలంగా విశ్వసించే ఆ సెంటిమెంటే కేసీఆర్ ను తీవ్రంగా కలచివేస్తోంది. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆరు.. ఆరు.. అని కలవరించిన...

యూవీతో శ్రుతిహాస‌న్‌?

యూవీ క్రియేష‌న్స్ ఇప్పుడు చిన్నా, మీడియం రేంజ్ సినిమాల‌పై దృష్టి పెట్టింది. ప్ర‌స్తుతం శ్రుతిహాస‌న్ కోసం ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ని సిద్థం చేసిన‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమాతో...

బస్సులోనే ప్రసవం.. మహిళా కండక్టర్ మానవత్వం

మ‌హాన‌గ‌రంలో ఇంకా మాన‌వ‌త్వం బ‌తికే ఉంద‌ని చాటారు మ‌హిళా కండక్ట‌ర్. ఆర్టీసీ బ‌స్సులో పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్భిణీకి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. హైద‌రాబాద్ లోని ...

జగన్ కు విజయమ్మ మరో షాక్!

వైసీపీ అధినేత జగన్ కు మరో షాక్. సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా షర్మిలను గెలిపించాలని పిలుపునిచ్చి వైసీపీకి షాక్ ఇచ్చిన విజయమ్మ, ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ షర్మిల నిర్వహించబోయే కార్యక్రమానికి హాజరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close