హైకోర్టులో కేసీఆర్ కు ‘కరెంట్ షాక్’

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్ కమిషన్ ను కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది.

నిబంధనల మేరకే పవర్ కమిషన్ వ్యవహరిస్తోందని..కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కు విచార్హత లేదని అడ్వకేట్ జనరల్ వాదనలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం సమర్ధించింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ తరఫు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదిస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టులో పవర్ కమిషన్ విచారణకు లైన్ క్లియర్ కావడంతో త్వరలోనే కేసీఆర్ కు మరోసారి పవర్ కమిషన్ నోటీసులు ఇవ్వనుంది.

బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ళు, ఒప్పందాలపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోరుతూ కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాము నిర్దేశించిన గడువులోగా సమాధానం చెప్పాలని పవర్ కమిషన్ ఆదేశించగా.. తనకు మరింత సమయం కావాలంటూ కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని విద్యుత్ కమిషన్ తోసిపుచ్చింది. దీంతో పవర్ కమిసన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.

విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ పిటిషన్ ను తాజాగా కొట్టివేయడంతో కేసీఆర్ విద్యుత్ కమిషన్ ముందు త్వరలోనే హాజరు కావాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజాభవన్‌లోనే చంద్రబాబు- రేవంత్ భేటీ

చంద్రబాబు ఆహ్వానానికి రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. నేనే వస్తానన్న చంద్రబాబు మాటకు తగ్గట్లుగా ప్రజాభవన్‌లోనే సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాభవన్ అే పేరును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరారు చేశారు....

నెల్లూరు సెంట్రల్ జైలుకు జగన్

వైసీపీ అధినేత జగన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. నాలుగో తేదీన ఆయన తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా నెల్లూరు వెళ్తారు. అక్కడ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

7 మండలాలు కాదు 5 గ్రామాల కోసం రేవంత్

ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగే భేటీలో ఏడు మండలాల కోసం పట్టుబట్టాలని .. ముందుగా ఆ అంశం తేల్చిన తర్వాతనే ఇతర అంశాల జోలికి వెళ్లాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్...

అన్నవరం వచ్చేశాడు.. ఇక ఆడబిడ్డలూ వచ్చేస్తారు!

ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యి కాదు..పదివేలు కాదు..ఏకంగా 30వేల మంది అమ్మాయిల ఆచూకీ లేదని పునరుద్ఘటించారు. ఇంత పెద్ద మొత్తంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close