ఏపీ నేతలతో బీజేపీ పొలిటికల్ గేమ్

దేశంలో బీజేపీ అత్యంత బలహీనంగా రాష్ట్రం ఏపీ. కానీ ఏపీలోనే భారతీయ జనతా పార్టీ రింగ్ మాస్టర్ గా మారింది. అన్ని పార్టీలు బీజేపీతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నాయి. ఎవరూ బీజేపీని వ్యతిరేకించడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీజేపీతో కలిసి అధికారిక మిత్రపక్షంగా మారాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్‌సీపీ కూటమిలో చేరకపోయినా టీడీపీ కంటే నమ్మకమైన మిత్రపక్షంగా ఉంటామని సంకేతాలు పంపుతోంది. జనసేన కూటమిలోనే ఉన్నామంటోంది.

బీజేపీతో పొత్తులపై టీడీపీ ఇప్పటి వరకూ బహిరంగంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్డీఏలో చేరే అంశంపైనా స్పందించలేదు. గతంలో ఓ సారి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం వివరాలు కూడా బయటకు రాలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి ఢిల్లీ వెళ్లి వారిద్దరితో సమావేశం అయ్యారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న చర్చల వివరాలు బయటకు రాలేదు. కేంద్రంలో వచ్చే సారి కూడా బీజేపీ గెలవడం ఖాయమని అంచనా వేస్తున్న సమయంలో బీజేపీ మద్దతు అవసరమని భావించి ఎన్డీఏ కూటమిలో చేరేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. పవన్ కూడా వెళ్లనున్నారు. అయితే చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత.. ఎం జరిగిందో బయటకు రాక ముందే ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ ఖరారైందని ఆయనకు సమాచారం వచ్చింది. అయితే అమిత్ షాతోనూ కలుస్తారు. జగన్ అజెండా రాజకీయమేనని చెప్పాల్లిన పని లేదు. లోపల ఏం చర్చిస్తారు.. టీడీపీ, బీజేపీ కలవకుండా చేయగలుగుతారా అన్నది తర్వాత విషయం. కానీ రాజకీయం మొత్తం బీజేపీ తమ చుట్టూనే తిప్పుకుంటోందని స్పష్టమవుతోంది. ఏపీలో ఇరవై ఐదు లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ గెలిచినా ఆ సీట్లన్నీ బీజేపీకే మద్దతుగా ఉంటాయి. అందుకే బీజేపీ కూడా అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close