చైతన్య : అడుగుకో వేణుస్వామీ – వీళ్లనేం చేయాలి ?

మరుక్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ నిజం అందరికీ తెలుసు. కానీ జాతకం చెబుతాం అని చెప్పి.. నాలుగు గీతలు గిసి.. అదీ ఇదీ అని చెప్పేస్తే నమ్మేసి లక్షలు ఇచ్చేస్తారు తమ జీవితంలో అనుకోకుండా జరిగిన వాటిని … కష్టపడి సాధించిన వాటిని కూడా ఇలా స్వాముల ఖాతాల్లో వేసేస్తారు కొంత మంది. ఇదంతా ఓ మైండ్ గేమ్. ఇలా జోస్యాలు చెప్పేవారు కింద నుంచి పైదాకా ఉంటారు. చిలుక జోస్యాలు చెప్పేవారి దగ్గర నుంచి వేణుస్వామి వంటి వారి వరకూ. వీరందర్నీ ఎవరు ప్రోత్సహిస్తున్నారు. ఇంకెవరు నమ్మేవారే.

జ్యోతిష్యం పేరుతో అంతా మోసమే

జ్యోతిష్యం పేరుతో ఈ రోజుల్లో జరుగుతున్నదంతా మోసమే. నిజంగా జ్యోతిష్యం చెప్పేవాళ్లు అయితే.. వాళ్ల జ్యోతిష్యం వాళ్లు చూసుకుంటారా ?. తన చావు ఎప్పుడొస్తుందో .,. ఇతరుల చావుల గురించి జ్యోతిష్యం చెప్పే వేణుస్వామి చెప్పగలడా ?. ఓ జంట విడిపోతారని చెప్పగలిగే ఆయన… తన భారీకాయాన్ని చూసి తన భార్య ఎప్పుడు వదిలి వెళ్లిపోతుందో ఇలా చార్ట్ వేసి చెప్పలగరా ?. చెప్పలేరు. తెలుసుకోలేరు. ఎందుకంటే… వారు చెప్పేదంతా ఫేక్ అని తెలుసు కాబట్టే. జ్యోతిష్యం, ఉంగరాలు, బొంగరాలు అంతా ఫేక్. అసలు నిజం ఏమిటంటే.. తరవాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.

భయపెట్టి .. బ్లాక్ మెయిలింగ్ చేయడమే ఇప్పుడు జ్యోతిష్యం

వేణు స్వామి మాత్రమే కాదు.. ఇలా జ్యోతిష్యాలు చెప్పే వారంతా .. తమ దగ్గరకు వచ్చిన వారిని నమ్మించి.. అదనీ.. ఇదనీ బ్లాక్ మెయిలింగ్ చేయడమే వ్యాపారంగా చేస్తున్నారు. తమకేమీ తెలియకపోయినా… టీవీ చానళ్లలో కూర్చుని చెప్పి.. ఎవరైనా నమ్మితే వారిని నట్టేట ముంచడమే వారి పని. వారి బాధితులు ఎంతో మంది ఉన్నారు. వేణు స్వామి ఇలా ఎందుకు జాతకాలు చెబుతాడంటే.. బ్లాక్ మెయిల్ చేయడానికేనని ఆయన గురించి తెలిసిన వారందరూ చెబుతారు. రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని చేయాల్సిన ప్రచారం చేశారు. తీరా తేడా వచ్చాక కొట్టకుండా.. కొత్త నాటకాలు మొదలు పెట్టారు. ఈమధ్యలో బకరాలు అయింది ఆ పార్టీలే.. ఆయనను నమ్మిన ప్రజలే.

ప్రజలు నిజాలను గుర్తించడమే పరిష్కారం !

వేణు స్వామి బయటకు కనిపిస్తున్న జ్యోతిష్య ఆనకొండ. .. సమాజంలో ఎన్నో పిల్ల పాములు ఉన్నాయి. ఒక్క సారి సోషల్ మీడియా ఆన్ చేస్తే.. కొండ దొరల దగ్గర నుంచి కోయదొర వరకూ.. ఇంకా పెద్ద పెద్ద పేర్లతో ఆస్ట్రాలజిస్టుల యాడ్స్ కనిపిస్తాయి. ఎందుకంటే.. ఆ బిజినెస్ అంతగా ఉంటోంది మరి. దీనికి ఎవరు ఆకర్షితులైనా నిండా మునిగిపోతారు . ఆ విషయం మోసపోయిన తర్వాతనే తెలుస్తుంది. అతీత శక్తులు ఉన్న వారు ఎవరూ ఉండరు. భవిష్యత్ ను చూడగలిగేవారు అసలు ఉండరు. కానీ.. మాటలతో మోసం చేసేవాళ్లు మాత్రం .. అన్ని చోట్లా ఉంటారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించడమే ముఖ్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close