బొత్సా.. ఇంకా ఇదేం రచ్చ!

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి మూడు రాజధానుల నిర్ణయం కూడా ఓ కారణమని ఫలితాలతో ప్రస్ఫుటమైంది. అయినా ఈ విషయాన్ని అంగీకరించేందుకు వైసీపీకి మనసొప్పడం లేదు. ప్రజలు తిరస్కరించిన మూడు రాజధానులకే ఇంకా కట్టుబడి ఉన్నామంటూ తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది.

మూడు రాజధానులపై బొత్స చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమో, పార్టీ విధానమో కానీ వైసీపీకి ఇంకా బుద్ది రాలేదని ప్రజల్లో చర్చ జరుగుతోంది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని వైసీపీ హామీ ఇచ్చినా ఉత్తరాంధ్రలో వైసీపీని ఆదరించలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సింది. కానీ, ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు అహం అడ్దోస్తుందో మరేమిటో కానీ, ఇంకా మూడు రాజధానుల పల్లవిని వినిపిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.

వైసీపీ తీసుకున్న నిర్ణయాలే ఆ పార్టీని ప్రతిపక్ష హోదాకు సైతం దూరం చేశాయి. మూడు రాజధానుల పేరుతో హడావిడి చేసి ఏపీకి రాజధాని లేకుండా చేయడం వైసీపీపై ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిందనేది ఓపెన్ సీక్రెట్. ఓటమి తర్వాత ఎందుకీ ఫలితాలు వచ్చాయని విశ్లేషించుకుంటే ఈ విషయం అర్థమై ఉండేదేమో. ఒకవేళ ఈ విషయం అర్థమైనా ఇంకా అహంకారం దోస్తీ చేస్తుండటమే ఈ వ్యాఖ్యలకు కారణమై ఉండొచ్చునని అంటున్నారు.

ఇప్పటికీ వైసీపీ మారకపోతే వచ్చే ఎన్నికల నాటికి 11 సీట్ల నుంచి జీరో నెంబర్ కు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజాభవన్‌లోనే చంద్రబాబు- రేవంత్ భేటీ

చంద్రబాబు ఆహ్వానానికి రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. నేనే వస్తానన్న చంద్రబాబు మాటకు తగ్గట్లుగా ప్రజాభవన్‌లోనే సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాభవన్ అే పేరును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరారు చేశారు....

నెల్లూరు సెంట్రల్ జైలుకు జగన్

వైసీపీ అధినేత జగన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. నాలుగో తేదీన ఆయన తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా నెల్లూరు వెళ్తారు. అక్కడ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

7 మండలాలు కాదు 5 గ్రామాల కోసం రేవంత్

ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగే భేటీలో ఏడు మండలాల కోసం పట్టుబట్టాలని .. ముందుగా ఆ అంశం తేల్చిన తర్వాతనే ఇతర అంశాల జోలికి వెళ్లాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్...

అన్నవరం వచ్చేశాడు.. ఇక ఆడబిడ్డలూ వచ్చేస్తారు!

ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యి కాదు..పదివేలు కాదు..ఏకంగా 30వేల మంది అమ్మాయిల ఆచూకీ లేదని పునరుద్ఘటించారు. ఇంత పెద్ద మొత్తంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close