ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ దాని కోసమేనా !?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశమయ్యారు. దాదాపుగా గంట పాటు చర్చలు జరిపారు.తాను ఉండవల్లితో కుటుంబ, రాజకీయ అంశాలను చర్చించానని బ్రదర్ అనిల్ తెలిపారు. మాకు సీక్రెట్స్ ఉంటాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయ అంశాలు కూడా చర్చించానని ప్రత్యేకంగా చెప్పడంతో భేటీ యాధృచ్చికంగా నిర్వహించినది కాదని తేలిపోయింది. వైఎస్ కుటుంబానికి ఉండవల్లి అరుణ్ కుమార్ సన్నిహితులు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన వైఎస్ సంస్మరణ సభకు ఏపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు.

కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు. ఇటీవల సీఎం జగన్ పరిపాలనా తీరుపైనా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీకి అనుకున్న విధంగా మైలేజీ రావడం లేదన్న అభిప్రాయం ఉంది. ఇటీవల ఏపీలో కూడా పార్టీ పెట్టకూడదన్న రూలేమీ లేదు కదా అని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆ తర్వాత తన రాజకీయ జీవితం తెలంగాణతోనే ముడిపడి ఉందని ప్రకటించి క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయంలో ముందడుగు వేయడానికి ఉండవల్లి సలహాలు తీసుకోవడానికి బ్రదర్ అనిల్ వచ్చి ఉంటారని చెబుతున్నారు. అలాగే వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా జగన్ – షర్మిల మధ్య విభేదాల పరిష్కారం కోసం ఉండవల్లి తన వంతు ప్రయత్నాలు చేయాలని కోరేందుకు కూడా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఉండవల్లి సలహాలు వరకూ ఇవ్వగలరు కానీ మధ్యవర్తిత్వం లాంటివేమీ చేయరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close