బీఆర్ఎస్ గ్రేట‌ర్ మీటింగ్ కు ఆ ఎమ్మెల్యేల డుమ్మా… జంపింగ్ కు రెడీనా?

తాను పాలు పోసిన పెంచి పాము త‌న‌నే కాటేసిన‌ట్లు… తాను అల‌వాటు చేసిన పార్టీ ఫిరాయింపులు త‌న మెడ‌కే చుట్టుకుంటున్నాయి కేసీఆర్ కు. 2014, 2018 ఎన్నిక‌ల త‌ర్వాత ఏ పార్టీలో గెలిచినా… అంతా గులాబీ గూటికే అన్న‌ట్లుగా పార్టీ మార‌గా, ఇప్పుడు కాంగ్రెస్ బ‌దులు తీర్చుకుంటుంది.

ఇప్ప‌టికే ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్. మ‌రో ఎమ్మెల్యే త్వ‌రలో కారు దిగ‌బోతున్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలు మూకుమ్మ‌డిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా… ఇంకెవ‌రు ఉంటారో, ఎవ‌రు పోతారో అన్న సందేహాలు గులాబీ క్యాడ‌ర్ లోనూ వ్య‌క్తం అవుతున్నాయి.

జీహెచ్ఎంసీ కౌన్సిల్ స‌మావేశాల దృష్ట్యా… కాంగ్రెస్ పార్టీకి బ‌లం లేనందున‌, జీహెచ్ఎంసీలో అనుస‌రించాల్సి వ్యూహాల‌పై గ్రేట‌ర్ కౌన్సిల‌ర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి 10మంది కార్పోరేట‌ర్లు స‌హ ప‌లువురు ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

త‌ల‌సాని పార్టీ మారుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. కానీ త‌ల‌సాని అధ్య‌క్ష‌త‌నే ఈ గ్రేట‌ర్ మీటింగ్ కొన‌సాగింది. కానీ ఉప్ప‌ల్ ఎమ్మెల్యే బండారు ల‌క్ష్మారెడ్డి, వివేకానంద‌, మాధ‌వ‌రం కృష్ణారావు, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, అరికెపూడి గాంధీ డుమ్మా కొట్టారు.

మాములుగా అయితే ఇలాంటి మీటింగ్స్ కేటీఆర్ నిర్వ‌హిస్తారు. కానీ, కేటీఆర్ ఢిల్లీలో ఉండి త‌ల‌సాని ఈ మీటింగ్ నిర్వ‌హించ‌టం చర్చ‌నీయాంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

రూ.1000 కోట్ల చేరువలో ‘క‌ల్కి’

'క‌ల్కి' మ్యాజిక్ ఫిగ‌ర్‌కు ద‌గ్గ‌ర కాబోతోంది. రూ.1000 కోట్ల (షేర్‌) వైపు దూసుకు వెళ్తోంది. ప్ర‌స్తుతం 'క‌ల్కి' రూ.900 కోట్ల వ‌సూళ్ల మార్క్ ని అందుకొంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఈవారంలో రూ.1000 కోట్లు...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close