బీటెక్ రవికి బెయిల్ మంజూరు

పది నెలల కిందట జరిగిన చిన్న తోపులాటలో ఓ పోలీసులకు గాయం అంయిందని.. అదే పది నెలల తర్వాత గుర్తించి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి.. కిడ్నాప్ తరహాలో బీటెక్ రవిని కడప పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను హత్య చేసేందుకే ఈ పని చేశారని.. పోలీసులే తీసుకె్ళ్లినట్లుగా తెలియడంతో అరెస్టు చూపించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో బీటెక్ రవికి తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలకడానికి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్‌ రవి కడప విమానాశ్రయం ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. అప్పట్లో కేసు నమోదు చేసి ఊరుకున్నారు. కానీ హఠాత్తుగా అరెస్టు చేశారు. ఓ నోటీసు లేదు.. పైగా పది నెలల పాటు ఆయన కనిపించడం లేదని ఎస్పీ చెప్పారు.

ఆయన పది నెలలుగా పులివెందులలోనే ఉన్నారు. ఎస్పీని కూడా కలిశారు. అయినా అడ్డగోలుగా అబద్దం చెప్పేశారు ఎస్పీ. చంపడానికే బీటెక్ రవిని తీసుకెళ్లారని సీఎం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. బీటెక్ రవిని అరెస్ట్ చేసిన తర్వాత మూడు గంటల పాటు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలన్నారు. వల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడానికి పావుగంట పడుతుందని మిగతా సమయం ఎక్కడ ఉంచారో చెప్పాలన్నారు. అయితే పోలీసులు సీఎం రమేష్ కు లీగల్ నోటీసుల ఇస్తామని బెదిరించారు. ఇవ్వాలని సీఎం రమేష్ సవాల్ చేశారు. కడప పోలీసుల గురించి కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చానని ఆయన ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close