వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల బెట్టింగ్ యాప్స్ స్కాంలో ఇరుక్కున్నారు.ఆమెపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బులు తీసుకుని బెట్టిం్ యాప్స్ ప్రమోషన్ చేసి అనేక మంది ఆత్మహత్యలకు కారణమయ్యారని వీరిపై కేసులు నమోదు చేశారు.శ్యామలతో సహా మొత్తం పదకొండు మంది టీవీ సెలబ్రిటీలు , ఇన్ ఫ్లూయన్సర్లపై ఈ కేసులు నమోదయ్యాయి.విష్ణుప్రియ టేస్టీతేజ ,రీతూ చౌదరి, సురేఖవాణి కూతురు సుప్రీత పై కూడా కేసులు పెట్టారు. ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయిలపై కేసులు పెట్టారు.
ఇంతకు ముందు విశాఖకు చెందిన లోకల్ బాయ్ నానిపై కేసు పెట్టి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బెట్టింగ్ యాప్స్ విషయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పోరాటం చేస్తున్నారు ..ఆయనే ప్రతీ రోజు అవగాహన కల్పిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు పెట్టాలని సూచిస్తుననారు. దీంతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
విశాఖలో లోకల్ బాయ్ నానిని అరెస్టు చేసినట్లుగా ఈ ఇన్ ఫ్లూయన్సర్లను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. కేసులు నమోదైన వారిలో చాలా మంది ఇప్పటికే తెలియక చేశామని.. ఇక నుంచి చేయబోమని క్షమాపణలు వేడుకున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల మాత్రం ఇంకా క్షమాపణలు చెప్పలేదు. ఫేక్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల లక్షలు సంపాదిస్తున్న వీరు ఎన్నో కుటుంబాలు నాశనమవడానికి కారణం అవుతున్నారు.