పెట్టిన వాతలు చాల్లేదు.. ఇక దుస్తుల మీద 12 శాతం జీఎస్టీ !

మనిషికి కావాల్సింది కూడు, గుడ్డ, నీడ. ఈ మూడు నిత్యావసరాల కిందకే వస్తాయి. రూ. ఐదు లక్షల కన్నా ఎక్కవ సంపాదిస్తే ఆదాయపు పన్ను.. సంపాదించినా.. సంపాదించకపోయినా పెట్రోల్, డీజిల్, పరోక్ష పన్నులతో మధ్య తరగతిని పీల్చి పిప్పి చేస్తున్న కేంద్రం… తాజాగా మరో వడ్డింపు రంగంలోకి తీసుకు వచ్చింది. ప్రజలు కొనుక్కునే దుస్తుల మీద పన్నెండు శాతం జీఎస్టీని అమలు చేయాలని నిర్ణయించింది. అంటే.. రూ. వెయ్యి పెట్టి బట్టలు కొనుక్కుంటే ప్రభుత్వానికి రూ. 120 టాక్స్ కట్టాల్సి ఉంటుంది.

అంటే రూ. పదకొండు వందల ఇరవై . ఇప్పటి వరకూ ప్రజలకు దుస్తులు నిత్యావసరంగానే గుర్తించి ఐదు శాతం పన్ను వసూలు చేస్తున్నారు. జనవరి ఒకటి నుంచి పన్నెండు శాతానికి పెంచుతున్నారు. దేశంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు పేదరికంలోకి జారిపోయారన్న నివేదికలు ఉన్నాయి. కరోనా కారణం.. ప్రభుత్వ విధానాల కారణంగా అనేక మంది ఉపాధి గల్లంతయిందని రిపోర్టులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం అడ్డగోలుగా.. ప్రజలకు రోజువారీ జీవితంలో అవసరమైన వాటిపై పన్నుల వడ్డింపు పెంచుకుంటూ పోతున్నారు.

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లుద ద్రవ్యోల్బణాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. తినే తిండి సహా అన్ని రకాల రోజు వారీ కార్యకలాపాల్లో వ్యయం పెరిగిపోయింది. అయినా కేంద్రం కనికరించడం లేదు. రూ. లక్షల కోట్లను పన్నుల రూపంలో ప్రభుత్వం వసూలు చేసుకుని అదే అభివృద్ధిగా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close