తిరుమ‌ల ల‌డ్డూ వివాదం… తీవ్రంగా స్పందించిన కేంద్ర‌మంత్రులు

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ల‌డ్డూ త‌యారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్న‌ట్లు తేల‌టంపై దేశ‌వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే హిందూ ధార్మిక సంస్థ‌లు తీవ్రంగా స్పందించ‌గా, తాజాగా కేంద్ర‌మంత్రులు ఘ‌ట‌న‌పై విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని కేంద్ర హోంశాఖ స‌హ‌య మంత్రి బండి సంజ‌య్ సీఎం చంద్ర‌బాబుకు లేఖ రాశారు. శ్రీ‌వారి ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీశార‌ని, అన్య‌మ‌త ప్ర‌చారం కొండ‌పై జ‌రుగుతుంద‌ని ఫిర్యాదులు వ‌చ్చినా గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌న్నారు. క్షమించ‌రాని నేరం చేసిన వారిని విడిచిపెట్ట‌వ‌ద్ద‌ని, అన్య‌మ‌తస్తుల‌ను చైర్మ‌న్లుగా చేశార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల అనుమానాల‌ను నివృతి చేయాల‌ని బండి సంజ‌య్ కోరారు.

మీ చుట్టూ జ‌రుగుతున్న హిందూ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌ను క్ష‌మించు స్వామి… తిరుమ‌ల‌కు చెందిన కాలేజీల్లో శ్రీ‌నివాసుడి ఫోటోలు తొల‌గించార‌ని, హిందూయేత‌ర గుర్తుల‌ను స‌ప్త‌గిరుల‌పై ఏర్పాటు చేయాల‌ని ఆనాటి జ‌గ‌న్ స‌ర్కార్ చూసింద‌ని మ‌రో కేంద్ర‌మంత్రి శోభాక‌రంద్లాజే వ్యాఖ్యానించారు.

చంద్ర‌బాబు చెప్పిన అంశం చాలా తీవ్ర‌మైన‌ది, దీనిపై వెంట‌నే స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌గాలి… దోషుల‌ను శిక్షించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషీ అన్నారు.

దేశ‌వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతున్న ఈ మొత్తం ఎపిసోడ్ పై ఏపీ సీఎం చంద్ర‌బాబు అందుబాటులో ఉన్న మంత్రుల‌తో చ‌ర్చించారు. త‌దుప‌రి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించి, సాయంత్రం లోపు పూర్తిస్థాయి నివేదిక‌ను పంపాల‌ని టీటీడీ ఈవోను ఆదేశించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రిమాండ్ రిపోర్ట్: త‌ప్పు ఒప్పుకొన్న జానీ మాస్ట‌ర్‌

లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జానీ మాస్ట‌ర్ ని ఉప్ప‌ర్ ప‌ల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత జానీ మాస్ట‌ర్ ని చంచ‌ల్ గూడా జైలుకు త‌ర‌లించారు....

జానీ మాస్ట‌ర్ కేస్‌: సి.క‌ల్యాణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ల్యాణ్ స్పందించారు. కొన్ని సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు. ఈ కేసు వెనుక కొంత‌మంది కుట్ర ఉంద‌ని, ఆ విష‌యాల్ని త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. ప‌ద‌హారేళ్లుగా ఆ...

‘దేవ‌ర’ ప్ర‌మోష‌న్ల‌కు ఇదొక్క‌టి చాలు!

టాలీవుడ్ అంతటా 'దేవర' ఫీవర్ పాకేసింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేక‌ర్స్ కూడా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఎన్టీఆర్ అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తూ, మీడియాతో, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. మిగిలిన...

ల్యాబ్ కూడా లేదా…? సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన టీటీడీ ఈవో

తిరుమ‌లకు ఎన్నో ఏళ్లుగా నెయ్యి స‌ర‌ఫ‌రా అవుతూనే ఉంటుంది. పాలు కూడా వ‌స్తుంటాయి. వేల కోట్లు ఖ‌ర్చు చేసి బ‌య‌ట నుండి కొనుగోలు చేస్తుంటారు. కానీ అవి స‌రిగ్గా ఉన్నాయో లేదో ప‌రిశీలించేందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close