హైకోర్టు తరలింపు తన చేతుల్లో లేదన్న కేంద్రం..!

కర్నూలుకు హైకోర్టు తరలింపు విషయంలో కేంద్రం పూర్తిగా తమ చేతుల్లో లేదని స్పష్టం చేసింది. ఈ అంశం సబ్ జ్యూడిస్‌లో ఉందని.. అంటే ఏపీ హైకోర్టులో విచారణలో ఉందని… స్పష్టం చేసింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ మేరకు ఓ ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు న్యాయశాఖ మంత్రి సమాధానం చెప్పారు. హైకోర్టు తరలింపులో తమ పాత్రేమీ ఉండదని.. హైకోర్టు , రాష్ట్ర ప్రభుత్వం ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని తేల్చేసింది.

న్యాయరాజధానిగా కర్నూలును ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టును కర్నూలు తరలించడానికి అసెంబ్లీలో చట్టం చేసింది. ఆ చట్టం చెల్లుతుందా లేదా అన్న అంశంపై ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నాయి. అయితే.. చట్టం చేయకపోయినా.. హైకోర్టును కేంద్రం అనుమతితో కర్నూలుకు తరలించాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. అందుకే… ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినా… హైకోర్టు రీ లోకేటింగ్ ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞాపన పత్రం సమర్పించి వస్తూ ఉంటారు. అదే విషయాన్ని మీడియాకు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కేంద్రం మాత్రం భిన్నమైన స్వరాన్ని వినిపించింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కడుతున్న జస్టిస్ సిటీలో హైకోర్టును ఏర్పాటు చేస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా..జ్యూడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలును నిర్ణయిస్తూ.. అసెంబ్లీ చట్టం చేసింది.అదే సమయంలో… హైకోర్టు అధికారాలను కూడా.. ఈ బిల్లు పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు ఎక్కడ ఉండాలనేది.. నిర్ణయించే అధికారం.. అసెంబ్లీకి లేదనేది న్యాయనిపుణుల వాదన. ఇప్పటి వరకూ హైకోర్టులు ఏర్పాటైన విధానం భిన్నంగా ఉంది. హైకోర్టును కర్నూలులో పెట్టాలనుకున్నప్పుడు.. ముందుగా ప్రతిపాదనను… సుప్రీంకోర్టుకు.. ఏపీ ప్రభుత్వం పంపాలి. హైకోర్టు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయంలో న్యాయవ్యవస్థ ప్రధాన స్టేక్ హోల్డర్ అయినప్పుడు వారికి సంబంధం లేకుండా తరలింపు అనేది సాధ్యం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close