డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇస్తామనలేదు.. అడగలేదు : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఎలాంటి పదవుల్ని ఆశించడం లేదని చంద్రబాబు ఢిల్లీలో స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన కీలక విషయాలపై స్పందించారు. డిప్యూటీ స్పీకర్ పోస్టు తీసుకుంటున్నారా అని మీడియా ప్రతినిధులు ఆరా తీస్తే ఆశ్చర్యకరమన సమాధానం చెప్పారు. అసలు డిప్యూటీ స్పీకర్ పోస్టుపై ఎలాంటి చర్చలు జరగలేదని.. వాళ్లు ఇస్తామనలేదు… తాము అడగలేదని తేల్చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు మాటల్ని బట్టి చూస్తే.. ఆ పోస్టుకు టీడీపీ పోటీ పడటం లేదని అర్థం చేసుకోవచ్చు.

పదవుల కోసం తాము చూడటం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నందున వారు ఆఫర్ చేసిన రెండు మంత్రి పదవుల్ని తీసుకున్నామన్నారు. వాజ్ పేయి హాయాంలో ఏడు మంత్రి పదవులు ఇస్తామన్నారని.. కానీ అవేమీ వద్దని చెప్పి ఒక్క స్పీకర్ పదవినే తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం కానీ పదవుల గురించి కాదని అంటున్నారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తల్ని సంప్రదిస్తూంటే మళ్లీ జగన్ వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. అయితే డెవిల్ ను నియంత్రించామని ఇక ఎలాంటి సమస్యా రాదని భరోసా ఇస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డితో భేటీలో.. రాష్ట్ర విభజన అంశాలపై సమగ్రంగా చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు. డిల్లీ పర్యటనలో చంద్రబాబు .. వచ్చే పూర్తి స్థాయి బడ్జెట్‌లో వివిధ శాఖల ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించేలా చూసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేటీఆర్‌ పాదయాత్ర చేయాలంటున్న క్యాడర్

భారత రాష్ట్ర సమితి క్యాడర్ లో ఉనికి బయం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో ఒకటి చేయాలని.. ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని హైకమాండ్ పై ఏదో రూపంలో ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా...

రెండు, మూడు నెలల జైలుకు జోగి రమేష్ రెడీ

మాజీ మంత్రి జోగి రమేష్ జైలు కోసం మానసికంగా రెడీ అయిపోతున్నారు. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని గంట గంటకూ బయపడటం కన్నా ఓ రెండు నెలల పాటు జైలుకు ఫిక్సయిపోతే పోతుంది...

ఊహాలోకంలో జగన్..ఎదురుదెబ్బలు తప్పవా?

తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా మారింది జగన్ రెడ్డి పరిస్థితి. ఓటమి నుంచి తేరుకొని మెల్లగా పొలిటికల్ ట్రాక్ ఎక్కబోతున్నామని సంబరపడుతున్న వైసీపీకి త్వరలోనే బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే...

‘భార‌తీయుడు పార్ట్ 3’ అవ‌స‌ర‌మా?

28 ఏళ్ల త‌ర‌వాత శంక‌ర్ భార‌తీయుడు చిత్రానికి సీక్వెల్ తీస్తాన‌ని చెప్ప‌డ‌మే ఓ ఆశ్చ‌ర్యం. ఇప్పుడు పార్ట్ 2 మాత్ర‌మే కాద‌ని, పార్ట్ 3 కూడా ఉంటుంద‌ని మ‌రో షాక్ ఇచ్చాడు. పార్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close