ఇండియా టుడే ప్రతి ఆరు నెలలకు ఓ సారి ప్రకటించే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు నాలుగో ప్లేస్ లో ఉన్నారు.గత ఏడాది ఆగస్టులో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు. ఈ ఆరు నెలల్లో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా రాష్ట్రాన్ని గాడినా పెట్టడంతో పాటు పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ఉచిత సిలిండర్ వంటి పథకాలు అమలు చేయడం చంద్రబాబు మైలేజీని పెంచింది.
బెస్ట్ సీఎంల జాబితాలో యోగి ఆదిత్యానాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. కుంభమేళా నిర్వహణ, ఏర్పాట్ల విషయంలో ఆయన ప్రజాదరణ చూరగొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ తర్వాత మూడో స్థానంలో ున్నారు. ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ఐదో స్థానంలో నిలిచారు.
తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టినప్పటికీ డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఇప్పటికీ మంచి ఆధిక్యంతో ఉందని మూడ్ ఆఫ్ ది నేషన్ స్పష్టం చేసింది. విజయ్ ప్రభావాన్ని పెద్దగా తేల్చలేదు. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి.