ప్రజాస్వామ్య పునాదులపై దాడి..శాంతి భద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం

గత ఐదేళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైసీపీ వ్యవహరించిందని జగన్ రెడ్డి పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎండగట్టారు. ప్రజాస్వామ్య పునాదులపై దాడి చేసి, వికృత చేష్టలకు పాల్పడ్డారన్నారు. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పాలన చూడలేదని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో శాంతి భద్రతల వైఫల్యంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

ప్రభుత్వ పెద్దల కక్ష సాధింపు చర్యల్లో పోలీసులను కూడా భాగస్వామ్యం చేశారని..వారితో కుమ్మకై నిబంధనలకు విరుద్దంగా కొంతమంది పోలీసులు వ్యవహరించారని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా పని చేయలేమని వాదించిన అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధించారని.. పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని తెలిపారు.

Also Read : అన్ని లెక్కలు తేల్చేస్తున్న చంద్రబాబు!

తనపై బాబ్లీ కేసు తప్ప గతంలో మరో కేసు లేదని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక 17కేసులు పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ పై కూడా 7 కేసులు నమోదు చేశారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఏకంగా అరవైకి పైగా కేసులు పెట్టి.. ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమ కేసులతో వేధించారని చెప్పారు. రఘురామకృష్ణంరాజును లాకప్ లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారని.. అందుకు సంబంధించిన వీడియోలను చూసి పైశాచిక ఆనందం పొందారని అన్నారు.

వైసీపీ హయాంలో కేసులు ఉన్న వారు ఓసారి నిల్చోవాలని చంద్రబాబు కోరగా..దాదాపు 80 శాతం మంది నిల్చున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసిన నాయకులందరిపై కేసులు పెట్టారని..కానీ అక్రమ కేసులు బనాయించిన వారినే ప్రజలు అసెంబ్లీకి దూరం చేశారని చంద్రబాబు అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close