చీపురుపల్లి రివ్యూ : బొత్సకు అంత వీజీ కాదు !

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం వీఐపీ నియోజకవర్గాల్లో ఒకటి. అక్కడ బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును బరిలోకి దింపారు చంద్రబాబు. బొత్స కాంగ్రెస్ తరపున పోటీ చేసి 2014లో ఓడిపోయారు. వైసీపీలో చేరి 2019లో గెలిచారు. ఆయన అసాధ్యుడైన రాజకీయ నేత ఏమీ కాదు. ఆయన మెజార్టీ ఎప్పుడూ అసాధారణంగా లేదు. గట్టి పోటీని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు చేసే ఎలక్షనీరింగ్ బొత్సకు ప్లస్. కానీ ఈ సారి ఆయనే మైనస్ అవుతున్నారు. ఆయన తీరు నచ్చక చాలా మంది పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.

చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం 2,03,178 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,01595 మంది ఉండగా పురుషులు 1,01574 మంది, ఇతరులు 9 మంది ఓటర్లున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాలలో 120 గ్రామ పంచాయితీలుండగా 150 రెవెన్యూ గ్రామాలున్నాయి. వాటిలో 257 పోలింగ్‌ బూత్‌లున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నువ్వా–నేనా అన్నట్లు ఉంటాయి. పోటీలో ఎవరు ఉన్నా పార్టీ ఓటు బ్యాంక్ మాత్రం పదిలంగా ఉంటుంది. 1999 లో బొబ్బిలి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన బొత్స.. ఆ తరువాత 2004లో చీపురుపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నారు.

తెలుగుదేశం జనసేన, బిజెపిల కూటమి తరుపున మాజీ మంత్రి, మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బరిలో దిగుతున్నారు. ఇప్పటి వరకూ టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నది యువనేత కిమిడి నాగార్జున. మాజీ మంత్రి .. గతంలో బొత్సపై గెలిచిన కిమిడి మృణాళిని కుమారుడు. కిమిడి కళా వెంకటరావు సోదరుడి కుమారుడే. కానీ బొత్స వంటి నేతను ఢీకొట్టేలా నాగార్జున బలపడలేకపోయారన్న భావనతో సీనియర్‌కు టీడీపీ హైకమాండ్ చాన్సిచ్చింది. పేరుకు బొత్స అభ్యర్థి అయినా అంతా ఆయన మేనల్లుడు మజ్లి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను కనుసన్నల్లోనే వ్యవహారాలు జరుగుతుతాయి. త్రిమూర్తుల రాజు, గద్దె బాబూరావులు గతంలో వైసీపీకి మద్దతు పలికినా టీడీపీలో చేరారు. కళా వెంకట్రావుకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇటీవలి కాలంలో టీడీపీలోకి పెద్ద ఎత్తున వలసులు జరుగుతున్నాయి. బొత్సకు భారీ మెజార్టీ ఇచ్చి మొరకముడిదాం మండలంలో కీలక నేతలుగా ఉన్న వారంతా టీడీపీలో చేరిపోయారు. దివంగత ఎమ్మెల్యే కోట్ల సన్యాసప్పలనాయుడు కుటుంబం మొత్తం టీడీపీలో చేరింది. భారీ కుటుంబం అయిన వారు మండలం మొత్తంలో వివిధ పదవుల్లో ఉన్నారు. గరివిడి మండలంలోనూ చేరికలు కనిపిస్తున్నాయి. మేజర్ పంచాయతీ అయిన సోమలింగాపురం వైసీపీ నేతలంతా టీడీపీలో చేరిపోయారు. బొత్సకు ఏకపక్షంగా ఓట్లేసే గ్రామాల్లో ఇప్పుడు రెండు వర్గాలయ్యాయి. కళా వెంకట్రావు సీనియర్ నేత కావడంతో.. సీనియర్ వైసీపీ నేతలు కూడా కలిసి నడిచేందుకు వస్తున్నారు. అయితే తన సీటును పెదనాన్న కు కేటాయించడంపై ఇప్పటికీ కిమిడీ నాగార్జున అసంతృప్తిగానే ఉన్నారు. ఆయనను దారిలోకి తెచ్చుకోవాల్సి ఉంది.

బొత్స సత్యనారాయణ ఈ సారి పోటీకి దూరంగా ఉండాలనుకున్నారు. రాజ్యసభకు వెళ్లాలనుకున్నారు. చీపురుపల్లి సీటును చిన్న శీనుకే ఇప్పించాలనుకున్నారు. కానీ జగన్ మాత్రం… పోటీ చేయాల్సిందేనని చెప్పడంతో బరిలోకి దిగారు. ప్రభుత్వంపై వ్యతిరేకత.. చిన్న శీను నిర్వాకాలపై వ్యతిరేకత.. వలసలు , జనసేన ఫ్యాక్టర్ అన్నీ చూస్తూంటే.. బొత్సకు అంత వీజీ కాదన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close