తెలంగాణ బీజేపీలో లొల్లి..పంచాయితీకి ఎండ్ కార్డు ఎప్పుడో?

తెలంగాణ బీజేపీలో పంచాయితీ ముదురుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – ఎమ్మెల్యేల మధ్య రోజురోజుకు గ్యాప్ మరింత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో సరైన గౌరవం లభించడం లేదని అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు .. తాజాగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశానికి ఏడుగురు డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అవుతోంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిన తీరు పట్ల ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేలు హాజరైనా ఎవరిని గవర్నర్ కు కిషన్ రెడ్డి పరిచయం చేయకపోవడం పట్ల వారంతా మనస్తాపానికి గురైనట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీ ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సంకోచిస్తున్నారు..? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

Also Read : హరీష్ కూడా స్పందించాల్సిందేనా.. లేదంటే..

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కొద్ది రోజుల్లోనే తప్పించి మరో నేతకు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలతో సఖ్యతగా మెదిలేందుకు అనాసక్తి చూపడం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యేల్లో కొంతమంది బండి సంజయ్ , ఈటల వర్గంగా ముద్ర పడటంతోనే వారిని కిషన్ రెడ్డి దూరం పెడుతున్నారన్న టాక్ నడుస్తోంది.

గత కొద్ది రోజులుగా కొనసాగుతోన్న ఈ అంతర్గతపోరుకు ఎప్పుడు ముగింపు లభిస్తుంది అని పార్టీ శ్రేణులు మధనపడుతుండగా.. కొత్త అధ్యక్షుడి ప్రకటనతోనే ఈ లొల్లికి ముగుస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌న‌సేన‌లోకి బాలినేని… జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాను ఏనాడూ ఏదీ ఆశించ‌కుండా, మంత్రిప‌ద‌విని సైతం వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిస్తే... నాపై ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడిస్తున్నా ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి బాలినేని మండిప‌డ్డారు. జ‌గ‌న్ వెంట‌నే క‌ష్ట‌కాలంలో న‌డిచిన 17మంది...

కిల్’ రీమేక్‌: ఏ స్టూడియోస్ + ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌

బాలీవుడ్ లో ఘ‌న విజ‌యాన్ని అందుకొన్న సినిమా 'కిల్‌'. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తార‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌డా బ‌డా నిర్మాణ సంస్థ‌లు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి....

ఎక్స్‌క్లూజీవ్‌: గ‌ప్ చుప్ గా ప్ర‌భాస్ సినిమా

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో ఓ సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. బుధ‌వారం నుంచే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది....

నాగ‌బాబు ట్వీట్… జానీ మాస్ట‌ర్ ఇష్యూ మీదేనా?

జ‌న‌సేన నేత‌, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ పై లైంగిక ఆరోప‌ణ‌లు రాగా కేసులు కూడా న‌మోద‌య్యాయి. ప‌రారీలో ఉన్న జానీ మాస్ట‌ర్ ను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close