చెన్నై అద‌ర‌గొట్టిందిగా

ఈసారి ఐపీఎల్ కొట్టేట్టే క‌నిపిస్తోంది చెన్నై. తొలి ఫేజ్ లో విజృంభించిన సూప‌ర్ కింగ్స్ … రెండో సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లోనూ త‌న ప్ర‌తాపం చూపించింది. ప‌టిష్ట‌మైన ముంబైని 20 ప‌రుగుల తేడాతో ఓడించి – ఈ ఫేజ్ ని ఘ‌నంగా ఆరంభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగులు చేసింది. అనంత‌రం ముంబై టీం.. నిర్ణీత 20 ఓవర్లతో 7 వికెట్లు కోల్పోయి 136 మాత్రమే చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.

నిజానికి చెన్నై ఆరంభం ఏమంత బాలేదు. తొలి 6 ఓవ‌ర్ల‌లో 24 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. కీల‌క‌మైన 4 వికెట్లు కోల్పోయింది. దానికి తోడు అంబ‌టి రాయుడు కూడా గాయంతో రిటైర్డ్ హార్డ్ గా వెనుదిరిగాడు. దాంతో.. చెన్నై క‌నీసం 100 ప‌రుగులైనా చేస్తుందా? అనిపించింది. ఈ ద‌శ‌లో రుతురాజ్ గైక్వాడ్ (55 బంతుల్లో 88) ఆదుకున్నాడు. జ‌డేజా (26), బ్రావో (8 బంతుల్లో 23) తోట్పాటు తో చెన్నైకి గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు అందించాడు. ధోనీ (3), రైనా (4), డుప్లెసీ (0), మొయిన్ అలీ (0) తీవ్రంగా నిశార ప‌రిచారు.

ఆ త‌ర‌వాత బ్యాటింగ్ కి దిగిమ‌న ముంబై – చెన్నై బౌల‌ర్ల‌ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డంలో విఫ‌లం అయ్యింది. తివారీ (50) ఒక్క‌డే కాస్త రాణించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడ‌క‌పోవ‌డంతో పొలార్డ్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close