ఏబీవీని విదేశాలకు వెళ్లకుండా ఆపలేకపోయారు !

అధికారంలోకి వచ్చినప్పటి నుండి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీ సర్కార్ వెంటాడుతోంది. అసలేం తప్పు చేశారో నాలుగేళ్లలో నిరూపించలేకపోగా .. ఆయనను మాత్రం రకరకాల కారణాలతో సస్పెన్షన్ లో ఉంచారు. ఇప్పుడు విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఐపీఎస్ అధికారి అయిన ఏబీవీకి ఆర్జిత సెలవులు ఉంటాయి. వాటిని సెలవులుగా ఉపయోగించుకుంటూ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎస్‌గా దరఖాస్తు చేసుకున్నారు.

అయితే సీఎస్ మాత్రం ఏ విషయం చెప్పలేదు. నిబంధనల ప్రకారం21 రోజుల వరకూ నిర్ణయం తీసుకోకపోతే అనుమతి వచ్చినట్లే. అయితే ఆ తర్వాత తనకు విచక్షణాధికారాలు ఉన్నాయని ఈఎల్స్ ఉపయోగించుకుని విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఏబీవీ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు అనుమతి నిరాకరిస్తూ సి ఎస్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది . విదేశాలకు వెళ్లేందుకు ఏబీవీకి అనుమతి ఇచ్ిచంది.

గత ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరావు పై వైసీపీ పెద్దలు ప్రభుత్వం రాగానే కక్ష సాధింపులు ప్రారంభించారు. సస్పెన్షన్ ను ఎత్తి వేయాలని హైకోర్టు ఆదేశించినా… పట్టించుకోలేదు. తర్వాత పోస్టింగ్ ఇచ్చి పదిహేను రోజుల్లో మళ్లీ సస్పెండ్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం నమోదు చేసిన అభియోగాలపై పూర్తిగా తేలకుండానే..ఆయనను డిస్మిస్ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి తొలగించడం, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడం కుదరదని స్పష్టం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close