పవన్ వస్తే గర్జించలేమని మథనపడుతున్న అమర్నాథ్ !

పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన పెట్టుకునే సరికి వైసీపీ నేతలు ఫ్యూజులు ఎగిపోయాయి. మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన అంటూ వైసీపీ నేతలు చేస్తున్న కార్యక్రమం రోజునే పవన్ కల్యాణ్ విశాఖ వెల్తున్నారు. తర్వాతి రోజు జనవాణి కార్యక్రమం పెట్టుకున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత తీసుకున్న గుడివాడ అమర్నాథ్‌కు .. పెద్ద చిక్కొచ్చి పడింది. తన గర్జనకు జనాలు వస్తారా రారా అనే టెన్షన్ ఒకటి అయితే.. పవన్ కల్యాణ్ పర్యటన కోసం జనసైనికులు.. భారీగా తరలి వస్తే.. వారి ముందు తన పరువు పోవడం ఖాయం. అందుకే గుడివాడ అమర్నాత్.. బెదిరింపులు ప్రారంభించారు.

పవన్ కల్యాణ్ విశాఖ రావొద్దని ఆయన అంటున్నారు. ఆయన విశాఖ వస్తే ప్రజలు నిలదీస్తారని అంటున్నారు. తన గర్జన కార్యక్రమం నుంచి దృష్టి మరల్చేందుకే ఆయన విశాఖ వస్తున్నారని ఏడ్చినంత ని చేస్తున్నారు. ఎప్పట్లాగే.. పవన్ కల్యాణ్ చంద్రబాబు పేకలో జోకర్ అంటూ వివాదాస్పద కామెంట్లూ చేశారు. అయితే అమర్నాథ్ తీరు చూసి జనం కూడా నవ్వుకుంటున్నారు. పవన్ కల్యాణ్ విశాఖ వస్తే ఎందుకంత తడుపుకుంటున్నారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే పవన్ కల్యాణ్.. మూడు రాజధానుల విషయంలో తన వాదన బలంగా వినపించారు. ఒక్క రాజధాని అమరావతికే మద్దతు ప్రకటించారు. నిజానికి వైసీపీ నేతలు అమర్నాథ్ తో సహా మొత్తం గతంలో మద్దతు ప్రకటించారు. వారు మాట మార్చారు. పవన్ మార్చలేదు అదే తేడా. అయినా సరే వీరంతా పవన్ కల్యాణ్‌పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉన్నారు. చివరికి విశాఖ పర్యటనకు రావొద్దని బతిమాలుకునే పరిస్థితి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close