రేవంత్‌ను కలిసేందుకు వెనుకాడుతున్న కీలక ఐఏఎస్‌లు !

ప్రభుత్వం మారితే అప్పటి వరకూ ఉన్న అధికార పార్టీ నేతలు కంగారు పడాలి. కక్ష సాధింపులు ఉంటాయేమో అని. కానీ ఇప్పుడు అధికారులు కూడా కంగారు పడాల్సి వస్తోంది. ఎందుకంటే… కొంత మంది అధికారులు పార్టీ నేతలుగా మారి… సేవలు చేశారు మరి. అలాంటి వారిలో బీఆర్ఎస్ సర్కార్ లో కొంత మంది పేరు పడిపోయారు. కేటీఆర్ కు జయేష్ రంజన్ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అన్నీ ఆయన చేతుల మీదుగానే నడిచేవి. కేటీఆర్ హాజరు కావాల్సిన కొన్ని కార్యక్రమాలకు కూడా ఆయనే హాజరయ్యేవారు.

అలాగే సీఎంవోలో స్మితా సభర్వాల్ పాత్ర చాలా కీలకం. తెలంగాణ ఏర్పరిచినప్పుడు మెదక్ కలెక్టర్ గా ఉన్న ఆమె కన్నీరుపెట్టుకున్నారు. అవి వైరల్ కావడంతో బీఆర్ఎస్ నేతల దగ్గర గుర్తింపు లభించింది. సీఎంవోలో కీలక బాధ్యతల్లోకి వెళ్లారు. పదేళ్లుగా సీఎంవోలో ఆమె చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ కూడా ఆమె దగ్గరే ఉంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ ను ఓ సంస్థకు ధారాదత్తం అర్వింద్ కుమార్ అనే ఐఎఎస్‌తో పాటు మరికొంత మంది అధికారులు… సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ ను కలవలేదు. గతంలో రేవంత్ ఈ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఊహించని విధంగా ప్రభుత్వం మారిపోవడంతో ఆ అధికారులకు గడ్డు ప రిస్థితులు ఎదురవుతాయని భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిని కూడా కవలలేనంతగా అధికార పార్టీతో.. నేతలతో సన్నిహితంగా వ్యవహరించడం ఎందుకని.. అధికారం పోతే కంగారు పడాల్సివస్తుందని ముందుగానే ఆలోచించుకోరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రిమాండ్ రిపోర్ట్: త‌ప్పు ఒప్పుకొన్న జానీ మాస్ట‌ర్‌

లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జానీ మాస్ట‌ర్ ని ఉప్ప‌ర్ ప‌ల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత జానీ మాస్ట‌ర్ ని చంచ‌ల్ గూడా జైలుకు త‌ర‌లించారు....

జానీ మాస్ట‌ర్ కేస్‌: సి.క‌ల్యాణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ల్యాణ్ స్పందించారు. కొన్ని సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు. ఈ కేసు వెనుక కొంత‌మంది కుట్ర ఉంద‌ని, ఆ విష‌యాల్ని త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. ప‌ద‌హారేళ్లుగా ఆ...

‘దేవ‌ర’ ప్ర‌మోష‌న్ల‌కు ఇదొక్క‌టి చాలు!

టాలీవుడ్ అంతటా 'దేవర' ఫీవర్ పాకేసింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేక‌ర్స్ కూడా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఎన్టీఆర్ అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తూ, మీడియాతో, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. మిగిలిన...

ల్యాబ్ కూడా లేదా…? సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన టీటీడీ ఈవో

తిరుమ‌లకు ఎన్నో ఏళ్లుగా నెయ్యి స‌ర‌ఫ‌రా అవుతూనే ఉంటుంది. పాలు కూడా వ‌స్తుంటాయి. వేల కోట్లు ఖ‌ర్చు చేసి బ‌య‌ట నుండి కొనుగోలు చేస్తుంటారు. కానీ అవి స‌రిగ్గా ఉన్నాయో లేదో ప‌రిశీలించేందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close