వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందాన్ని బెదిరించడానికి, వారిపై ఒత్తిడి తీసుకురావడానికి గత ప్రభుత్వ పెద్దలు చేసిన నిర్వాకాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో ఏకంగా సీబీఐ ఎస్పీ రాంసింగ్ పైనే కేసు పెట్టారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసినట్లుగా గుర్తించారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు వివేకా కుమార్తె, అల్లుడిపైనా తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపి నివేదికను రెడీచేశారు. పులివెందులో కోర్టులో సమర్పించారు.
వివేకా హత్యకేసును తేల్చకుండా సీబీఐపై గత ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు పాల్పడిందో లెక్కే లేదు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ వస్తే కర్నూలులో అడ్డం పడిపోయారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. సీబీఐకి సహకరించేందుకు నిరాకరించారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో డ్రామాలు ఆడిన తర్వాత హైకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారు. జైలుకెళ్లకుండానే బెయిల్ వచ్చేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య వివేకా హత్యకేసు లో బయటపడాల్సిన అనేక అంశాలు సంచలనంగా మారుతున్నాయి.
వివేకాను ఎంత ప్లాన్డ్ గా మర్డర్ చేసి.. గుండెపోటుగా ప్రచారం చేశారో ప్రజలు చూశారు. అధికారం చేతికి వచ్చిన తర్వాత .. తప్పుడు దర్యాప్తు చేసి అమాయకుల మీద నెట్టేసి కేసును క్లోజ్ చేయాలని చూశారు. సీబీఐకి కేసు ఇవ్వడంతో వారి ఆటలు సాగలేదు. అయితే కుట్రలన్నీ బయటపడటం లేదు. వివేకా కుమార్తె, అల్లుడి పోరాటం మాత్రం సాగుతోంది.