ఇక మిషన్ భగీరథ అక్రమాల ఫైల్స్ !

మిషన్‌ భగీరథ పథకంలో అవకతవకలు జరిగాయంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. మెటీరియల్‌ కొ నుగోలు వ్యవహారంలో గోల్‌మాల్‌ జరిగినట్టు, పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారనే ఫిర్యాదులు రావడంతో మిషన్‌ భగీరథ పైప్‌లై న్‌ పనులపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు ఈ పథకంలో రూ.7000 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ విజిలెన్స్‌ విభాగం అంతర్గత నివేదిక సమర్పించింది.

ప్రతి మండలంలోనూ ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ చేసిన పనులు, ఖర్చు చేసిన నిధులు తదితరాలను పరిశీలించాలని నిర్దేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంటింటికీ మంచినీటి అందించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టింది. ఆయా గ్రామాల వరకూ పైపు లైన్లను వేసినా.. గ్రామాల్లో మాత్రం పాత ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, పైపు లైన్లకే లింక్‌ చేసినట్లు కాంగ్రెస్‌ సర్కారుకు నివేదికలు అందాయి. అవన్నీ కూడా అంతకు ముందు కాంగ్రెస్‌ హయాంలో వేసినవేనని కూడా వాటిలో స్పష్టం చేశారు. ఆయా ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, పైపులైన్లను వేయకుండానే వేసినట్లు బిల్లులు కూడా తీసేసుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి. తద్వారా కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రతిష్టాత్మక పనుల్లో మిషన్ భగీరథ కూడా ఒకటి. భారీ ఖర్చుతో చేపట్టారు. అయితే ఇందులో లెక్కలేనంత అవినీతి ఉందని.. పైపుల పేరుతో పెద్ద ఎత్తున కొల్లగొట్టారన్న విమర్శలు ఉన్నాయి. వాటి లెక్క తేల్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇందులో విచారణ ప్రారంభమైతే మరికొంత మంది బీఆర్ఎస్ నేతలకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close