కూటమి కాదు.. షర్మిలే జగన్ టార్గెట్..!?

ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. షర్మిల తాను ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుండగా..జగన్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వొద్దని వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు పడుతున్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా..వైసీపీ ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఇండియా కూటమిలోని కీలకమైన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొనడం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ఇండియా కూటమికి మద్దతు తెలిపితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురు అవుతాయి. అలా కాదని కామ్ గా ఉంటే సొంత సోదరి తనకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఇది జగన్ కు ఏమాత్రం రుచించడం లేదు. తనకు నష్టం జరిగినా పరవాలేదు కానీ, తనతో విబేధించిన షర్మిల ఎదుగుదలను జగన్ అసలు జీర్ణించుకోలేరని..జగన్ మనస్తత్వం తెలిసిన నేతలు చెబుతున్న మాట ఇది. అందుకే జగన్ ప్లాన్ మార్చి ఇండియా కూటమి వైపు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

Also Read :ఇండియా కూట‌మిలోకి జ‌గ‌న్… అఖిలేష్ తోనే రాయ‌బారం?

ఇండియా కూటమి వైపు వెళ్తున్నట్లు సంకేతాలు ఇస్తే బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడమే కాదు..భవిష్యత్ లో కాంగ్రెస్ ఫేవర్ కోరవచ్చు అనే వ్యూహంతో జగన్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ఒకవేళ ఎన్డీయే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తే ఎలాగూ ఇండియా కూటమి నుంచి మద్దతు లభిస్తుందన్న ఆలోచనతో ఉన్నారని అంటున్నారు.

అప్పటి పరిస్థితుల ఆధారంగా జగన్ ..కాంగ్రెస్ కు మరింత చేరువ అయ్యే అవకాశం లేకపోలేదని..అదే జరిగితే తాను కోరుకున్న విధంగా షర్మిలను కాంగ్రెస్ లో బలహీనపరిచినట్లు అవుతుందనే జగన్ ఈ స్ట్రాటజీ మెయింటేన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close