నాటి డీజీపీ సేఫ్ – కానీ సజ్జల ?

ముంబై నటి జెత్వానీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంతో సర్వీస్ ఉన్న తన భవిష్యత్ ప్రమాదంలో పడటంతో … ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ పూసగుచ్చినట్లుగా జరిగినది అంతా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు కుట్ర నాటి సీఎంవో అయిన తాడేపల్లి ప్యాలెస్ లోనే జరిగిందని తేలింది. పీఎస్ఆర్ ఆంజనేయులు .. ముంబై టి జెత్వానీని ఎలా ఇరికించాలన్న ప్లాన్ ను… కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు సీఎం క్యాంప్ ఆఫీసులోనే వివరించారు. అక్కడే ప్లాన్ చేసి ఏర్పాట్లు కూడా చేసి పంపించారు.

మొత్తం కుట్ర సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. అయితే ఈ వ్యవహారంలో నాటి డీజీపీకి అసలు పాత్ర లేదని తేల్చడం ఇక్కడ అసలు విశేషం. నాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి కనీసం సమాచారం ఇవ్వకుండానే ఇతర రాష్ట్రాల్లో ఆపరేషన్ చేశారని తేలింది. దీంతో ఆయన సేఫ్ అయ్యారు. మరి పీఎస్ఆర్ ఆంజనేయలు సీఎం క్యాంప్ ఆఫీసులో ఎవరితో మాట్లాడిన తరవాత ఈ కుట్రను అమలు చేశారన్నది ఇప్పుడు బయటకు లాగాల్సి ఉంది. అది నేరుగా జగన్ ఇచ్చారా లేకపోతే.. సజ్జల ఇచ్చారా అన్నది కీలకమే. నిజానికి ఇక్కడ సజ్జలకు స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. ఉంటే గింటే జగన్ దే అయి ఉంటుంది. ఆయన సూచనల మేరకు అనధికారికంగా పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న సజ్జల ద్వారా పని పూర్తి చేయించారు.

ఇప్పుడు పీఎస్ఆర్ ఆంజనేయులపై కేసు పెట్టి అరెస్టు చేసి.. కస్టడీలోకి తీసుకుని వివరాలు రాబడితే.. అసలు సీఎంవోలో ఎవరి ఆదేశాలతో జెత్వానీని అరెస్టు చేసే కుట్రలకు పాల్పడ్డారో బయటకు వచ్చే అవకాశం ఉంది. అది కూడా సమయానుకూలంగా జరగనుంది. మొత్తంగా జెత్వానీ కేసుతో రాజకీయాలకు సంబంధం లేదు. కానీ.. అత్యంత కీలక వ్యక్తులక పాత్ర బయటపడబోతోందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close