వృద్ధులపై జగన్ కుట్ర బట్టబయలు !

వాలంటీర్లు లేకపోయినా లబ్దిదారులందరికీ మధ్యాహ్నానికి పెన్షన్లు పపిణీ చేయవచ్చు. వారిని సచివాలయాలకు పిలిపించి ఎండలో చంపేందుకు కుట్ర చేయాల్సిన పని లేదు. బ్యాంకుల్లో వేసి బ్యాంకుల చుట్టూ తిప్పాల్సిన అవసరం రాలేదు. కానీ ఒకటో తేదీన వాలంటీర్లను ఉపయోగించుకోకుండానే అందరికీ పెన్షన్లు అందేశాయి. ఇదంతా ప్రభుత్వ ఉద్యోగుుల ద్వారానే జరిగింది. మరి ఎన్నికల సమయంలో.. మండుటెండల్లో ఎందుకు ప్రభుత్వం ఆా పని చేయలేదు అన్నది సులువుగా అర్థం చేసుకోవచ్చు.

వృద్ధుల శవాలతో రాజకీయం చేయాలనుకున్నది వైసీపీ. జగన్ , సజ్జల స్క్రిప్ట్ రెడీ చేశారు. ఎలాగూ వాలంటీర్లతో పంపిణీకి ఈసీ బ్రేక్ వేస్తుంది కాబట్టి.. వాలంటీర్లు లేకపోతే పించన్లు అందవన్న ప్రచారం చేయాలనుకున్నారు. దానికి కారణం చంద్రబాబే అని రెచ్చగొట్టాలనుకున్నారు. అనుకున్నట్లుగా స్క్రీన్ ప్లే రెడీ చేశారు. అయితే కొంత మంది కలెక్టర్లు మనకు ఉద్యోగుల కొరతే లేదని .. ఒకటో తేదీ ఉదయమే పెన్షన్లు పంపిణీ చేయడానికి రెడీ అని చెప్పారు. కానీ ఈసీ బ్యాంకులో అయినా వేయవచ్చని సలహా ఇచ్చిందని దాన్నే ప్రయోగించారు.

ఫలితంగా పించన్ల రాజకీయంలో పలువురు వృద్ధులు చనిపోయారు. వారి శవాలతో రాజకీయం చేసేందుకు వైసీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. జోగి రమేష్ ఓ శవం దగ్గరకు వెళ్లి ఆ శవంతో.. చంద్రబాబు ఇంటికి ర్యాలీగా వెళ్లాలని అనుకున్నారు. ఆ మృతురాలి బంధువులు చెడామడా తిట్టి పంపించారు. ఆ తర్వాత ఓట్ల రూపంలోనూ అదే పరిస్థితి ఎదురయింది. మొత్తంగా ఎన్నికల సమయంలో పెన్షన్ వ్యవహారంలో వృద్ధుల ప్రాణాలు పోవడానికి కారణం జగన్ అని ప్రజలకు చంద్రబాబు తెలియచెప్పగలిగారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల‌స‌రి సెల‌వులపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఆయా కంపెనీల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల నెల‌స‌రి సెలవుల‌ను త‌ప్ప‌నిసరి చేయాల‌న్న పిటిష‌న్ పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు మంచివే కానీ అది వారి భ‌విష్య‌త్ కు...

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close