జగన్ ఇంక మారడా..ఇలా అయితే కష్టమే!

జగన్ తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతారు. ప్రజలు ఏమనుకుంటున్నారో..వాటిపై స్పష్టత ఇవ్వాలని అసలే అనుకోరు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే వ్యవహరించారో ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తున్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని శ్వేత పత్రం ద్వారా చంద్రబాబు వాస్తవ పరిస్థితులను బయట పెడుతుంటే.. ఎంచక్కా ఇంట్లో కూర్చొని తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు జగన్.

వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై అసెంబ్లీలో చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేస్తారని ముందే ప్రకటించారు. నిజంగా జగన్ చెబుతున్నట్లుగా చంద్రబాబు చెప్పేవి అవాస్తవాలు ఐతే వాటిని అసెంబ్లీకి హాజరై ఖండిస్తే..జగన్ ప్రసంగానికి విశ్వసనీయత ఉండేది. కానీ, అలా చేయకపోవడమే జగన్ ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారని చంద్రబాబు చేస్తోన్న వాదనలకు బలం చేకూర్చినట్లు అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు ఆరు అంశాలపై చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. వేటిపై కూడా వైసీపీ కిక్కురుమనలేదు. ఆర్థిక విధ్వంసంపై చంద్రబాబు శ్వేతపత్రం అనగానే జగన్ హడావిడిగా మీడియా ముందుకు వచ్చేయడంపై పలు రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read : ప్రజాస్వామ్య పునాదులపై దాడి..శాంతి భద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం

తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత ఇలాగే సర్కార్ శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తే.. బీఆర్ఎస్ తమ ఘన కీర్తిని చాటుకునేలా కౌంటర్ గా వైట్ పేపర్ రిలీజ్ చేసింది. అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాకున్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరై ప్రభుత్వ శ్వేతపత్రం శుద్ద తప్పని వాదించే ప్రయత్నం చేశారు. వైసీపీ అలా కూడా చేయడం లేదు. జగన్ తాను హాజరు కాకపోయినా ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి దూరంగా ఉంచుతున్నారు. తను రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ను చదివేసి మమ అనిపించేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close