ఆ రిటైర్డ్ ఐఏఎస్ విధేయత టిక్కెట్‌ ఇవ్వడానికి సరిపోలేదా !?

జగన్ రెడ్డి సీఎం అవగానే ఆయనకు తనంత విధేయుడు.. ఆత్మీయుడు ఎవరూ ఉండరన్నట్లుగా వ్యవహరించారు ఐఏఎస్ ఆధికారి ఎస్ఆర్‌కేఆర్ విజయ్ కుమార్. ఆయన ఉత్సాహాన్ని జగన్ రెడ్డి సంపూర్ణంగా వాడుకున్నారు. అమరావతి నిర్ణయాల్లో చేసిన తప్పుడు వ్యవహారాలన్నింటికీ ఆయననే ముందు పెట్టారు. తప్పుడు నివేదికలను వివిధ సంస్థలతో ఇప్పించడంలో ఆయనదే కీలక పాత్ర. ఇందుకు ప్రతిఫలంగా టిక్కెట్లు ఆఫర్ చేశారేమో కానీ.. ప్రతి సమావేశంలో జగన్ రెడ్డిపై పొగడ్తలు.. టీడీపీ నేతలపై విమర్శలు చేసేవారు.

అయితే ఆయన ఇప్పుడు రోడ్డున పడ్డారు. టిక్కెట్ల కేటాయింపులో ఆయన పేరు అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు. పాదయాత్ర చేయాలని వైసీపీ పెద్దలు సూచిస్తే అదీ చేశారు. కానీ పట్టించుకోవడం దీంతో ఆయన కూడా తాను మోసపోయానని అనుకున్నారేమో కానీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులు అన్యాయానికి గురయ్యారని మాట్లాడటం ప్రారంభించారు. కామెడీ ఏమిటంటే ఆయన అంతకు ముందు కూలీ మీడియా అటెన్షన్ పొందేవారు. ఈ సారి వారు ఆయనను పట్టించుకోవడం లేదు. నాగార్జున యూనివర్శిటి ముందు దళితలతో సభ నిర్వహించినా పట్టించుకోవడం లేదు.

దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని జగన్ రెడ్డి వాడుకున్నట్లుగా ఎవరూ వాడుకోలేదు. వారిని ముందు పెట్టి తన రాజకీయ లక్ష్యాన్ని అందుకుంటున్నారు. చివరికి వారంతా బలి పశువులు అయ్యే పరిస్థితి వస్తోంది. రిటైర్ అయినా… ప్రభుత్వం మారితే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన.. వారిలో ఇప్పటికే ప్రారంభమై ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close