షర్మిల వాట్ నెక్ట్స్ ?

జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వేసిన స్టెప్‌కు షర్మిలకు మైండ్ బ్లాంక్ అయిపబోయిందని అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్ ఉందని.. వైసీపీని బలహీనం చేసి.. ఆ ప్లేస్ ను తాను క్యాప్చర్ చేస్తానని అనుకున్నారు., ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను పిలిచి జగన్ కాంగ్రెస్ దగ్గర అయితే ఏం చేద్దామని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. జగన్ మళ్లీ ఇండీ కూటమిలో చేరినా… కాంగ్రెస్ కు దగ్గరైనా షర్మిలకే ప్రాధాన్యమిస్తామని చెప్పి పంపించారని అప్పట్లో ప్రచారం జరిగింది.

Read Also: కూటమి కాదు.. షర్మిలే జగన్ టార్గెట్..!?

అందుకే షర్మిల ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సముద్రమని పిల్ల కాలువలన్నీ కాంగ్రెస్ లో చేరాల్సిందేనని ప్రకటించారు. ఎప్పటికైనా జగన్ కాంగ్రెస్ పంచన చేరాల్సిందేనని ఆమె అప్పట్లోనే తేల్చారు. జగన్ చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు షర్మిల ప్లాన్ బీ ఆలోచించుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ ను బతికించాలని షర్మిల ఆ పార్టీలో చేరలేదు. రాజకీయ అనివార్యతల కారణంగానే చేరారు. రాజకీయంగా తాను సస్టెయిన్ కావాలంటే కాంగ్రెస్ అండ ఉండాల్సిందేననుకున్నారు. ఆమె రాజకీయాలపై దూకుడుగా ఉండటానికి కారణం జగనే. ఇప్పుడు ఆ జగనే మరోసారి ఆమెను నిర్వీర్యం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

కాంగ్రెస్ కు తాను దగ్గరవ్వాలంటే… షర్మిలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలన్నది జగన్ రెడ్డి మొదటి షరతుగా ఉంటుంది. ఎందుకంటే ఏపీలో వైసీపీ ఓటు బ్యాంకుకు ఆమే ప్రధాన ముప్పు. ఈ విషయం గ్రహించనంత అమాయకురాలు కాదు షర్మిల. అందుకే జగన్ తప్పుడు కారణాలతో డిల్లీలో ధర్నా చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఇండీ కూటమితో ఆయన ముందే ఒప్పందం చేసుకున్నారని కాస్త ఆలస్యంగా గ్రహించారు. ఇప్పుడు షర్మిల మరోసారి క్రాస్ రోడ్ లో నిలబడినట్లయింది. ఆమె తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close