సీఎం సీఎం నినాదాలు – పాల్‌కు కాదు జగన్‌కు !

పోలింగ్ ముగిసిన వెంటనే కేఏ పాల్ ఓ సమావేశం పెట్టారు. మీడియాను పిలిచారు. ఆ సమావేశానికి వచ్చిన వారంతా సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తించారు. జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత తేలిందేమిటంటే వారందరికి తలా ఐదు వందలు ఇచ్చి తీసుకు వచ్చారని. ఇప్పుడు జగన్ కూడా అదే బాట పట్టారు . బెంగళూరు నుంచి ఆయన వస్తూంటే రెండు రోజుల నుంచి అలర్ట్ చేసి.. బెజవాడ నుంచి వెల్లంపల్లి, దేవినేని అవినాష్ వంటి వార్ని పురమాయించి..ఓ రెండు వందల మందిని ఎయిర్ పోర్టు వద్ద గుమికూడేలా చేశారు. వారంతా జగన్ బయటకు వస్తూంటే.. సీఎం సీఎం అని నినాదాలిచ్చారు.

ఈ సీన్ చూసి ఎయిర్ పోర్టులో ఉన్న వారు కూడా ఆశ్చర్యపోయారు. బయటకు వెళ్తే ఆ నినాదాలు చేసిన వారందరికి వెల్లంపల్లినో.. అవినాష్‌లో కూలి చెల్లించాల్సిందే. అయినా జగన్ రెడ్డికి మానసికంగా సంతృప్తి పరచడానికి సీఎం నినాదాలు చేయించడం ఏమిటని.. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కోసం పోరాడుతున్నారని .. ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత అని నినాదాలు చేయాలన్న సెటైర్లు సహజంగానే వస్తున్నాయి.

జగన్ రెడ్డి బెంగళూరులో ఉన్నన్ని రోజులు ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. వైసీపీ నేతలు కూడా ఎవరికి వారు సైలెంట్ గా ఉన్నారు. కనీసం ప్రెస్ మీట్లు పెట్టేవారు లేరు. ఎప్పుడు ఎవరిపై కేసులు పడతాయోనని ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే జగన్ ను నమ్ముకుని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పెద్ద ఎత్తున చేసిన అన్యాయాలకు.. జైలు పిలుస్తోందని కంగారుగా ఉన్నారు. తమ సంగతేమిటో అని ఇతర నేతలూ బిక్కుబిక్కుమంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల‌స‌రి సెల‌వులపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఆయా కంపెనీల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల నెల‌స‌రి సెలవుల‌ను త‌ప్ప‌నిసరి చేయాల‌న్న పిటిష‌న్ పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు మంచివే కానీ అది వారి భ‌విష్య‌త్ కు...

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close