మాగుంటపై జగన్ రెడ్డికి అంత ద్వేషం ఎందుకు!?

వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిపై జగన్ రెడ్డి అంత ద్వేషం ఎందుకు పెచుకున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఇదే మాగుంటను గత ఎన్నికలకు ముందు బతిమాలి మరీ వైసీపీలోకి తెచ్చుకున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని కాదని మాగుంటకు టిక్కెట్ ఇచ్చారు. ఎందుకంటే మాగుంట వల్ల ప్రకాశం జిల్లాలోనే కాదు నెల్లూరులోనూ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు అదే నేతను పట్టుబట్టి మెడపట్టి బయటకు గెంటేస్తున్నారు.

మాగుంట వల్ల ఎంతో మేలు ఉంటుందనే తాను పట్టుబడుతున్నానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఎవరూ పట్టించుకోకపోతే తనకెందకంటున్నారు. నిజానికి మంత్రిగా ఉన్న సమయంలో బాలినేనికి, మాగుంటకు సరిపడేది కాదు. కానీ ఇప్పుడు ఆయననే గట్టిగా సమర్థిస్తున్నారు బాలినేని. మాగుంటను కాదని తిరుపతి నుంచి చెవిరెడ్డిని తెచ్చి టిక్కెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్నదానిపైనా స్పష్టత లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట తండ్రీ కొడుకుల పేర్లు ఉన్నాయి. కానీ తండ్రీని అరెస్టు చేయలేదు. కుమారుడ్ని అరెస్టు చేశారు. ఆయన చాలా కాలం జైల్లో ఉండి అప్రూవర్ గా మారి పూర్తి స్థాయి బెయిల్ తెచ్చుకున్నారు ఈ వ్యవహారంలో సాయిరెడ్డి అల్లుడి సోదరుడిదే కీలక పాత్ర. ఈ కేసు కారణంగా ఆయనపై వ్యతిరేకత పెంచుకోరు.

మరి ఎందుకు మాగుంటను వద్దనుకుంటున్నారో వైసీపీ వర్గాలకు అర్థం కావడం లేదు. పంజాబ్ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థిక సాయం అందించారని చెబుతున్నారు. ఈ ఆర్థిక సాయాన్ని జగన్ రెడ్డి చెప్పడం వల్లనే మాగుంట ఇచ్చారని బీజేపీ అనుమానిస్తోంది. ఇప్పుడు మాగుంటకు టిక్కెట్ ఇస్తే.. అదే నిజమనుని బీజేపీ తనపై కక్ష సాధింపులకు పాల్పడుతుందన్న భయంతోనే మాగుంటను పక్కన పెట్టాలని అనుకుంటున్నారని వైసీపీ వర్గాలు ఓ నిర్దారణకు వస్తున్నాయ. మాగుంటకు సీటివ్వకపోతే బాలినేని కూడా దూరమవుతాడని తెలిసినా సరే బీజేపీ భయంతోనే మాగుంటను దూరం పెడుతున్నారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్‌: అక్కినేనిని మ‌రిచిన ఈనాడు

ఈరోజు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు శ‌త జ‌యంతి. ఓ మ‌హాన‌టుడి ప్ర‌యాణంలో, ప్ర‌స్థానంలో శ‌తాబ్ద కాలం పూర్త‌య్యింది. ఓర‌కంగా తెలుగు చిత్ర‌సీమ పండ‌గ‌లా జ‌రుపుకోవాల్సిన త‌రుణం ఇది. అయితే ఏపీలో ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే చ‌క్క‌బ‌డుతున్నాయి....

దిల్‌రాజుకు కీల‌క పద‌వి?

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క‌మైన ప‌ద‌వి క‌ట్ట‌బెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎఫ్‌.డి.సి (ఫిల్మ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌) ఛైర్మ‌న్‌గా దిల్ రాజును ఎంపిక చేయొచ్చ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌....

కొత్త ట్రెండ్ : ఇంటికన్నా ఇంటీరియర్ ఖర్చు ఎక్కువ !

ఓ దశాబ్దం కిందట ఇల్లు అంటే... గోడలు, అల్మరాలు మాత్రమే. ఇంకా కాస్త డబ్బు ఉంటే.. ఆ అల్మరాలకు ప్లైఉడ్ తలుపులు పెట్టించుకుంటారు. కానీ తర్వాత రాను రాను...

విడదల రజనీ వసూళ్లపై విచారణ

విడదల రజనీ వసూళ్లపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది . అధికారంలో ఉన్నప్పుడు చిలుకలూరిపేట మొత్తాన్ని దున్ని పారేసినట్లుగా వసూళ్లు చేశారు రజనీ గ్యాంగ్. ఆమె బావమరిది ఈ గ్యాంగ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close