పులివెందులలో దాడులెప్పుడూ లేవు : జగన్

పులివెందులలో దాడులు ఎప్పుడూ జరగలేదని అలాంటి సంప్రదాయం లేదని .. కానీ టీడీపీ తీసుకు వచ్చిందని జగన్ ఆరోపించారు. క్రికెట్ ఆటలో జరిగిన గొడవలో అజయ్ రెడ్డి అనే యువకుడు గాయపడ్డాడు. అది రాజకీయ గొడవగా మార్చేసిన జగన్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి మరీ ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

పాతికేళ్ల యువకుడు అజయ్ పై టీడీపీ నేతలు నిర్ధాక్షణ్యంగా దాడికి దిగారని.. రాష్ట్రవ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయడానికే ఈ తరహా దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబూ మీరు వేసే ఈ చెడు సాంప్రదాయ బీజం రేపు పొద్దున్న మరల మీ కార్యకర్తలకు చుట్టుకుంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబూ ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరన్న విషయాన్ని గుర్తుపెట్టుకొండని కూడా చెప్పారు.

ఈ మాటలేవో జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనకు తానుగా అనుకుని ఉంటే జరుగుతాయని భయపడుతున్న ఎన్నో ఘటనలకు అసలు అవకాశమే ఉండేది కాదు. అధికారంలో ఉన్న రోజున రేపన్నదే లేదన్నట్లుగా చెలరేగిపోయారు. ఇప్పుడు ఎక్కడెక్కడో జరుగుతున్న చిన్న గొడవలకి రాజకీయ రంగు పూసి దాడులు అయిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. అసలు తాము ఇంకా రెడ్ బుక్ తెరవలేదని.. అసలు కథ ప్రారంభిస్తే ఇంకెలా ఉంటుందోనని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

పులివెందులలో దాడులే ఉండవని ఆయన చెప్పడం … కూడా ఆశ్చర్యకరమే. అసలు దాడులు లేనిదెప్పుడో ఆయన చెప్పి ఉండాల్సింది. అయితే అప్పట్లో ఏకపక్ష దాడులు జరిగేవి. ఇప్పుడు ఎదురు తిరిగి కొట్టే వాళ్లు కూడా తయారయ్యారు. అదే మార్పు గురించి బహుశఆ జగన్ చెప్పి ఉండవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close