జగన్‌ టైంపాస్ విమర్శలు !

జగన్మోహన్ రెడ్డికి పాస్ పోర్టు రాలేదు. లండన్ పోలేకపోయారు. అలాగని విజయవాడలో ఉండలేకపోయారు. బెంగళూరు వెళ్లిపోయారు. రాత్రికి రాత్రి ఓ ట్వీట్ పడేశారు. అది చాట భారతం అంత ఉంది . అందులో చేసిన ఆరోపణల్నే మళ్లీ మళ్లీ చేశారు. సాక్షిలో రోజూ చెప్పిందే..మళ్లీ చెప్పారు. అదే గేట్లు.. అదే నది… అదే సమీక్ష… అదే మళ్లింపు. అంతేనా… విజయవాడలో ఒక్కరికీ సాయం అందలేదట. ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయట.

విజయవాడలో ఏం జరుగుతుందో విజయవాడ వాసులకు తెలుసు. మీడియాలో చూపిస్తున్న ఇతర ప్రాంతాల వాళ్లకు తెలుసు. కానీ జగన్ రెడ్డి తాను చెప్పింది.. సాక్షి రాసింది మాత్రమే జనం నమ్ముతారని అనుకుంటారేమో కానీ అసలు కళ్ల ఎదుట జరుగుతున్న వాటిని కూడా జరగడం లేదని రాసేస్తారు. ఇంత ఘోరమైన రాజకీయం… ఎలా చేయాలనిపిస్తుందో కానీ అదే చేస్తారు. పాస్ పోర్టు పని మీద రెండు సార్లు అమరావతికి వచ్చి కొద్ది సేపు నీళ్లల్లో షో చేసి వెళ్లిన ఆయన.. రెయింబవళ్లు కష్టపడుతున్న వారిని కించ పరుస్తున్నారు.

కుట్ర రాజకీయాల నిర్వాకంలో ఒక్కొక్క కుట్ర బయటపడుతున్నప్పుడు .. ఎలాంటి ఎదురుదాడి చేయాలో అని.. ఆలోచించుకుని బురద పోగేసుకుని చల్లేస్తున్నట్లుగా విమర్శిస్తున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా ఉన్న ప్రతిపక్షం కాబట్టి అవకాశాల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాల్సింది. నిజమైన ప్రజాకోణంలో ప్రభుత్వాన్ని మరింత బాధ్యతాయుతంగా చేసేలా ఒత్తిడి చేయాల్సింది. అలా కాకుండా.. బెంగళూరులో కూర్చుని.. టైంపాస్ విమర్శలు చేస్తూంటే.. ప్రజల్లో మరింత చులకన అవుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close